అపార్ధం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "నాపెన్ను నీవే తీసి దాచావు" శివా  శివాలెత్తుతూ ఆరుంబాకా నోరుపెట్టుకుని అరుస్తున్నాడు. "నీపెన్ను నేనెందుకు తీస్తాను?  మతిమరుపు పెద్దయ్యా" ఇంకా గట్టిగా అరవసాగింది జయ."ఏమిటి టాప్ ఎగరగొడుతున్నారు ?" తాత రాగానే ఇక లొడలొడ ఎవరిగొడవ వారు చెప్పసాగారు."నేనో కథ చెప్తా వినండి. తప్పు గా అవతలి వారి ని అర్ధం చేసుకోవటాన్ని అపార్ధం  అంటారు. ఓపిట్ట ఓమోడువారిన చెట్టు దగ్గరకు వెళ్లి "నీకొమ్మల్లో గూడు కట్టుకుంటాను" అంది."ఊహా!వద్దు " గట్టిగా అంది చెట్టు. పక్కనే గుబురుగా ఓ పెద్ద తీగె బాగా పైకి పాకింది. ఆ చెట్టు చెట్టుకొమ్మ దాకా అల్లిబిల్లిగా అల్లుకుపోయింది.పిట్ట హాయిగా ఆతీగె గుబురులో గూడు కట్టి గుడ్లు పెట్టింది.ఓరోజు  ఎవరో వచ్చి    చెట్టుని కాస్తా మొదలంటా నరికేశారు.పిట్ట ఆనేలకూలిన చెట్టు దగ్గర వాలింది."పిట్టమ్మా!నేను ఎండిమోడుగా మారాను.నన్ను మనిషి ఎప్పుడో కొట్టేస్తాడని నాకు తెలుసు. అందుకే నాపైన నిన్ను గూడు కట్టనివ్వలేదు." పిట్ట పశ్చాత్తాపం తో అంది " నిన్ను  అపార్ధం చేసుకున్నాను.నన్ను క్షమించు" తాత కథ చెప్పి అన్నాడు "ఠక్కున ఎవరినీ అపార్ధం చేసుకోరాదు."సారీ అంటూ పిల్లలు కిలకిలా నవ్వేశారు 🌹.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం