అరవై ఏడేళ్ళ వయస్సులోనూ చెదరని నిబ్బరం. రోజూ ఇరవై అయిదు కిలోమీటర్ల నడక ప్రయాణం. విసుగనేది లేకుండా పాఠాలు చెప్తున్న టీచర్. ఆవిడ పేరు నారాయణి. గత యాభై సంవత్సరాలుగా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు.
మాతా పితా గురువు దైవం అంటారు కదా. వీరిలో అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చే గురువులు సామాన్యులు కారు.
సొంత డబ్బులతో పేదింటి పిల్లలను చదివించడం, తన జీతంలో పిల్లలకు అన్నం పెట్టి పాఠ్యపుస్తకాలు కొనివ్వడం, తనవద్ద చదువుకుంటున్న విద్యార్థులకు ఇంటినే గ్రంథాలయంగా మార్చడం, ఉచిత శిక్షణ ఇవ్వడం వంటి గురువుల గురించి ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం.
అయితే అరవై ఏడేళ్ళ వయస్సులోనూ నారాయణీ టీచర్ నడిచి వెళ్ళి పాఠాలు చెప్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
కేరళలోని కాసర్గడ్ జిల్లా చెరువత్తూర్ ప్రాంతానికి చెందిన కె.వి. నారాయణి గారిని ఆ ప్రాంతంలో అందరూ నారాయణీ టీచర్ అనే పిలుస్తారు. ఆవిడకు రోజు అనేది ఉదయం నాలుగున్నర గంటలకే మొదలవుతుంది. నడుచుకుంటూ వెళ్ళి ఉదయం ఆరున్నర గంటలకల్లా మొదటి విద్యార్థి ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఒక్కో విద్యార్థి ఇంటికీ వెళ్ళి పాఠాలు చెప్తుంటారు. తను చెప్పదలచుకున్న విద్యార్థులందరికీ పాఠాలు చెప్పి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంటారు.
వయస్సు మీదపడినప్పటికీ ఆమె ఏ మాత్రం అలసిపోకుండా పాఠాలు చెప్పడానికి కారణాలు రెండు. ఒకటి, కుటుంబపోషణ. రెండు, అనారోగ్యంతో మంచంపట్టిన తన భర్తను చూసుకోవడం.
తన దినసరి శారీరక వ్యాయామంగా ఈ కాలినడకనే భావిస్తున్న నారాయణీ టీచర్ తన శరీరం సహకరించేంత వరకూ నడుస్తానని చెప్పారు. ఇప్పుడు నారాయణీ టీచర్ కుటుంబం ఉంటున్నది అద్దె ఇల్లు.ఎప్పటికైనా ఓ సొంతింటిని ఏర్పాటు చేసుకోవాలన్నది ఆమె కల.
మాతృభాష మళయాలంతోపాటు మరికొన్ని భాషలు కూడా తెలిసిన నారాయణీ టీచర్
ఇప్పటివరకూ ఏ స్కూల్లోనూ పని చేయలేదు. పదిహేనో ఏట సరదాగా తోటి వారికి తెలిసిన నాలుగు ముక్కలు చెప్తూ వచ్చిన ఆవిడ 1971లో స్కూలు ఫైనల్ ప్యాసయ్యారు. ఆ తర్వాత ఏ కాలేజీలోనూ చేరలేదు. కానీ వివిధ సబ్జెక్టులలో పట్టు సంపాదించిన ఆవిడకు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం బాగా వచ్చు.
కోవిడ్ - 19 మహమ్మారితో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోను ఆవిడ
పాఠాలు చెప్పడం మానలేదు. తన దగ్గర చదువుకుంటున్న పిల్లల్లు మంచి మార్కులే తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఆవిడ పాఠాలు చెప్పుకుంటూ వచ్చే డబ్బులతోనే జీవితాన్ని నడిపిస్తున్నారు. ఇది తప్ప మరో రాబడి అంటూ ఏమీ లేదు. తన దగ్గర చదువుకున్న వారిలో ఇప్పుడు కొందరు డాక్టర్లుగా ఉన్నారన్నారు నారాయణీ టీచర్. మళయాలం సినిమాల్లో నటిస్తున్న కావ్య మాధవన్ కూడా ఆవిడ దగ్గరే చదువుకున్నారు. అప్పుడప్పుడు ఆవిడ కొందరి సహకారంతో గల్ఫ్ వెళ్ళి అక్కడుంటున్న పిల్లలకుకూడా చదువు చెప్పిన సందర్భాలున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలైన ఆమె తమిళనాడులోని పళని ఆలయానికి వెళ్తుంటారు. ఎంత దూరమైనా చెప్పుల్లేకుండా నడుస్తారు. ప్రతి సంవత్సరం ఆవిడ 693 మెట్లున్న పళని కొండనెక్కుతారు. ఆరోగ్యం సహకరించేవరకూ నడక, విద్యాబోధన కొనసాగిస్తానన్నారు నారాయణీ టీచర్!
మాతా పితా గురువు దైవం అంటారు కదా. వీరిలో అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చే గురువులు సామాన్యులు కారు.
సొంత డబ్బులతో పేదింటి పిల్లలను చదివించడం, తన జీతంలో పిల్లలకు అన్నం పెట్టి పాఠ్యపుస్తకాలు కొనివ్వడం, తనవద్ద చదువుకుంటున్న విద్యార్థులకు ఇంటినే గ్రంథాలయంగా మార్చడం, ఉచిత శిక్షణ ఇవ్వడం వంటి గురువుల గురించి ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం.
అయితే అరవై ఏడేళ్ళ వయస్సులోనూ నారాయణీ టీచర్ నడిచి వెళ్ళి పాఠాలు చెప్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
కేరళలోని కాసర్గడ్ జిల్లా చెరువత్తూర్ ప్రాంతానికి చెందిన కె.వి. నారాయణి గారిని ఆ ప్రాంతంలో అందరూ నారాయణీ టీచర్ అనే పిలుస్తారు. ఆవిడకు రోజు అనేది ఉదయం నాలుగున్నర గంటలకే మొదలవుతుంది. నడుచుకుంటూ వెళ్ళి ఉదయం ఆరున్నర గంటలకల్లా మొదటి విద్యార్థి ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఒక్కో విద్యార్థి ఇంటికీ వెళ్ళి పాఠాలు చెప్తుంటారు. తను చెప్పదలచుకున్న విద్యార్థులందరికీ పాఠాలు చెప్పి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంటారు.
వయస్సు మీదపడినప్పటికీ ఆమె ఏ మాత్రం అలసిపోకుండా పాఠాలు చెప్పడానికి కారణాలు రెండు. ఒకటి, కుటుంబపోషణ. రెండు, అనారోగ్యంతో మంచంపట్టిన తన భర్తను చూసుకోవడం.
తన దినసరి శారీరక వ్యాయామంగా ఈ కాలినడకనే భావిస్తున్న నారాయణీ టీచర్ తన శరీరం సహకరించేంత వరకూ నడుస్తానని చెప్పారు. ఇప్పుడు నారాయణీ టీచర్ కుటుంబం ఉంటున్నది అద్దె ఇల్లు.ఎప్పటికైనా ఓ సొంతింటిని ఏర్పాటు చేసుకోవాలన్నది ఆమె కల.
మాతృభాష మళయాలంతోపాటు మరికొన్ని భాషలు కూడా తెలిసిన నారాయణీ టీచర్
ఇప్పటివరకూ ఏ స్కూల్లోనూ పని చేయలేదు. పదిహేనో ఏట సరదాగా తోటి వారికి తెలిసిన నాలుగు ముక్కలు చెప్తూ వచ్చిన ఆవిడ 1971లో స్కూలు ఫైనల్ ప్యాసయ్యారు. ఆ తర్వాత ఏ కాలేజీలోనూ చేరలేదు. కానీ వివిధ సబ్జెక్టులలో పట్టు సంపాదించిన ఆవిడకు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం బాగా వచ్చు.
కోవిడ్ - 19 మహమ్మారితో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోను ఆవిడ
పాఠాలు చెప్పడం మానలేదు. తన దగ్గర చదువుకుంటున్న పిల్లల్లు మంచి మార్కులే తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఆవిడ పాఠాలు చెప్పుకుంటూ వచ్చే డబ్బులతోనే జీవితాన్ని నడిపిస్తున్నారు. ఇది తప్ప మరో రాబడి అంటూ ఏమీ లేదు. తన దగ్గర చదువుకున్న వారిలో ఇప్పుడు కొందరు డాక్టర్లుగా ఉన్నారన్నారు నారాయణీ టీచర్. మళయాలం సినిమాల్లో నటిస్తున్న కావ్య మాధవన్ కూడా ఆవిడ దగ్గరే చదువుకున్నారు. అప్పుడప్పుడు ఆవిడ కొందరి సహకారంతో గల్ఫ్ వెళ్ళి అక్కడుంటున్న పిల్లలకుకూడా చదువు చెప్పిన సందర్భాలున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలైన ఆమె తమిళనాడులోని పళని ఆలయానికి వెళ్తుంటారు. ఎంత దూరమైనా చెప్పుల్లేకుండా నడుస్తారు. ప్రతి సంవత్సరం ఆవిడ 693 మెట్లున్న పళని కొండనెక్కుతారు. ఆరోగ్యం సహకరించేవరకూ నడక, విద్యాబోధన కొనసాగిస్తానన్నారు నారాయణీ టీచర్!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి