తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బాలసభ
 తెలంగాణ ఆదర్శ పాఠశాల
బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రతినెల నాలుగువ శనివారము "నో బ్యాగ్ డే" గా ప్రకటించింది.ఆ రోజు విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను బయటికి తీసే విధంగా ఆటలు,పాటలు మాటలు,నృత్యాలు చేయడం,నాటికలు వేయడం,కథలు చెప్పడము,ఏకపాత్రలు అభినయించడం,పల్లె సుద్దులు,గొల్ల సుద్దులు చెప్పడం,వీధి నాటకాలు కోలాటం,గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడడం, పద్యాలు పాడి భావాలు చెప్పడము,శ్లోకాలకు చదివి అర్థం చెప్పడం,రంగు కాగితాలతో బొమ్మలు చేయడం(ఒరిగామి)వ్యక్తుల గురించి మాట్లాడము మొదలగు కార్యక్రమాలు చేపట్టడం వలన విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా మాట్లాడే శక్తిని సంపాదించుకుంటారు చదువుతోపాటు సాంస్కృతిక,విద్యాపరమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు.వీటితో పాటు పాఠశాల పరిశుభ్రత,తరగతి గది పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియజేయడము,క్షేత్ర పర్యటనలకు తీసుకువెళ్లడం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు.విద్యార్థులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కె.కృష్ణవేణి గారు గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం