కలవరపడని ఎడిసన్; - - జగదీశ్ యామిజాల
 శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బుని కనుగొన్నాక దానిని తన మిత్రులకు, తోటి శాస్త్రవేత్తలకు చూపడం కోసం ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. 
ఆయన ప్రయోగశాలలోనే పైఅంతస్తులో ఈ సమావేశం ఏర్పాటైంది.
ఎడిసన్ తన అసిస్టెంటుని పిలిచి విద్యుత్ బల్బుని పైకి తీసుకురమ్మన్నాడు. 
అయితే ఆ అసిస్టెంటు బల్బుని తీసుకొస్తుండగా అది చేజారి కింద పడి పగిలిపోయింది. 
విషయం తెలిసి అందరూ ఆందోళన చెందారు. ఎడిసన్ ఏమంటారో అని అసిస్టెంట్ భయపడ్డాడు. కానీ ఎడిసన్ ఏమాత్రం చలించలేదు.
వేయి ప్రయోగాలు చేసి విఫలమై బల్బుని తయారుచేసిన ఎడిసన్ కి మరో బల్బు తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదుగా.
అప్పటికప్పుడు కాస్తంత శ్రమపడి కొత్త బల్బుని తయారుచేశాడు ఎడిసన్. దానిని తీసుకురావలసిందిగా తన అసిస్టెంటుతో చెప్పాడు.
మొదటిసారి బల్బుని ముక్కలు చేసిన అతనినే మళ్ళీ బల్బుని తెమ్మంటున్నారేమిటీ అని కొందరడిగారు.
అప్పుడు ఎడిసన్ "అతను బల్బు పగలకొట్టినా మరో బల్బు నేను తయారు చేయగలను. కానీ నా సహాయకుడి మనసుని గాయపరిస్తే దానిని నేను మళ్ళీ సరిచేయలేను కదా?  అందుకే అతనినే బల్బు తీసుకురమ్మని చెప్పాను. అతను తనకు అప్పగించిన పనిని, బాధ్యతను గుర్తెరిగి, నేను అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయక అతనీసారి సవ్యంగానే బల్బు తీసుకొస్తాడనే నమ్మకం నాకుంది" అన్నాడు. 
ఆ క్షణమే ఎడిసన్ విజయం సాధించడంలో పాటించిన సహనాన్ని అందరూ గ్రహించారు.
ఎడిసన్ వేయి సార్లు ఓటమి చవిచూసి విద్యుత్ బల్బుని కనిపెట్టాడు. తీరా ఆ బల్బు సహాయకుడి చేజారి కింద పడి పగిలినప్పుడు సైతం ఎడిసన్ ఏమాత్రం కలవరపడలేదు. ఆందోళన చెందలేదు. ఆ క్లిష్టపరిస్థితిలోనూ ఎడిసన్ శాంతంగానే ఉం
డిన గొప్ప వ్యక్తి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం