కరి మ్రింగిన వెలగపండు
 *ఏనుగు తను మ్రింగిన వెలగ పండులోని గుజ్జుని, ఆ పండుని ఏ మాత్రం పగలకొట్టకుండా, ఎలా ఆస్వాదిస్తోంది?*
🌼🌼🌼🌼🌼🌼🌼🌼
'కరి మ్రింగిన వెలగపండు’ అనగా ‘ఏనుగు తిన్న వెలగ పండు’ అని, ఏనుగు యొక్క గొప్పదైన జీర్ణశక్తి వలన, అది మ్రింగిన వెలగ పండు, అలాగే ఉండి దానిలోని గుజ్జు మాయమౌతుందని తెలుగు కవులు వ్రాశారు.
కానీ, విన్న, చదివిన, పరిశీలించిన వాటి ప్రకారం,
“అమరకోశంలో విశేషార్ధాల్లో చూస్తే, కరిః కపిత్థ కోసోత్థహా అని ఒక అర్ధం ఉంది.
"కరి అంటే, వెలగపండులో తనంత తానుగా పుట్టే ఒక పురుగు అని అర్ధం.” కంటికి కనపడని ఒక క్రిమి.”
తెలుగులో కరి అంటే ఏనుగు అనే అర్ధంలో ప్రచారంలో ఉండడం వలన, కరి అంటే ఏనుగు అని పొరపాటు పడడం వల్ల, కరి మింగిన వెలగపండు అంటే ఏనుగు మింగిన వెలగపండు అనే కధ ప్రచారంలోకి వచ్చింది. ఏనుగు వెలగపండును తిన్న తర్వాత, గుజ్జును తినేసి, పెంకు పగలకుండా వెలగపండును పండులా విసర్జించడాన్ని ఎవరూ చూడలేదు. మావటి వాళ్ళు కూడా ఎవరూ చూసినట్టు చెప్పలేదు. అందువలన ఏనుగుకు అలాంటి శక్తులేవీ లేవు.
ఈ విషయం వెలగచెట్టును గమనిస్తే స్పష్టంగా తెలుస్తుంది. వెలగ చెట్టుకు ఉన్న కాయల్లో కొన్ని డొల్లల్లా వేలాడుతూ, గాలికి ఊగుతూ కిందపడిపోతాయి. అవి పగలకొట్టి చూస్తే అందులో గుజ్జు ఉండదు. వెలగకాయలో తనంత తానుగా ఒక క్రిమి పుడుతుంది. ఈ క్రిమినే సంస్కృతంలో కరి అంటారు. ఈ పురుగు వెలగపండులోని గుజ్జంతా నల్లగా మార్చేసి డొల్లగా చేసెస్తుంది.
ఆంధ్రుల సాంఘిక చరిత్రలో, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు కూడా ఈ విషయాన్ని చర్చించారు. సంస్కృతం లో ‘గజ భుక్త కపిత్థవత్ ’ అని గలదు. దీనికి “గజ క్రిమి రూపేణ” అని వ్యాఖ్య. కంటికి కనపడని క్రిమి వెలగ కాయ లోనికి ప్రవేశించి, గుజ్జు నంతటిని నల్లగా మార్చి వేస్తుందని, ‘కరి అనగా నలుపు ’అని, “ కరి మ్రింగిన ”అంటే, “నల్లగా మారిన ” అని అర్థం చెపుతున్నారు.
అందువలన ఇక్కడ కరి అంటే ఏనుగు అనే అర్ధంలో తీసుకోరాదని స్పష్టమౌతోంది. 
*సర్వేజనాస్సుఖినోభవంతు*
🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం