వాటర్ విజ్ఞానం ;- ఎస్ మౌనిక

 హాయ్! మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారేంటి? నేనైతే ఫుల్ హ్యాపీ!మరి మీరు? విషింగ్ ఏ వెరీ హ్యాపీ డే!🤝🤝..... ఈరోజు ఇంకో కొత్త విషయంతో మీ నేస్తం మీ ముందుకు వచ్చేసిందిగా! ఈరోజు మనం నీటి గురించి కొన్ని ఆసక్తికరమైన  విషయాలు తెలుసుకుందాం. వింటే  నిజంగానా! అని అనిపిస్తుంది మరి! ఇప్పుడు సరదాగా నీటితో ఆడుకుందామా? ఏం లేదు. గుప్పెడు నిండుగా నీళ్ళని తీసుకొని ఒక్కసారి పైకి ఎగరేయండి. ఆ నీరు మన మీద పడుతుంటే ఆ ఆనందమే వేరు కదా? నీటిని పైకి ఎగిరేసినప్పుడు అవి గోళాకారంలోనే మారుతాయి. అంటే స్పెరికల్ షేప్ లోకి మారుతాయి. త్రిభుజాకారం లోకి,చతురస్రాకారంలోకి ఎందుకు మారవు? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? నీటిని మనం పైకి ఎగిరేసినప్పుడు అది పెద్ద బిందువులుగా మారుతుంది. అప్పుడు అది తక్కువ ఉపరితల విస్తీర్ణంలో ఉండడానికి ప్రయత్నిస్తుంది. దానికి తోడు గాలిలో అన్ని వైపుల నుండి  సమానమైన ఫోర్స్ ఉంటుంది. మిగిలిన అన్ని ఆకారాలలో అంటే  చతురస్రం కానీ, త్రిభుజం కానీ మిగతా ఏ ఆకారాలతో పోల్చుకున్నా గోళాకారానికే ఉపరితలం తక్కువగా ఉంటుంది. నీరే కాదు..... ఏ ద్రవరూపమైన కానీ..... గోళాకారంలో ఉండడానికి ఇష్టపడుతుంది. దాన్ని పైకి ఎగరేసినప్పుడు..... తెలుసుకోవడానికి వింతగా అనిపిస్తుంది కదూ!.... నాకైతే అలానే అనిపించింది మొదటిసారి విన్నప్పుడు..... ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ నేస్తం మీ కోసం తీసుకురావడానికి రెడీ! త్వరలో ఇంకో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. ఓకేనా? బాయ్! 👋👋
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం