జ్ఞాన సంపదే శ్రేష్టం; -:సిహెచ్.సాయిప్రతాప్
వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు.  అనుభవ జ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తి చూపి శాప గ్రస్తుడయ్యాడని పురాణ కథ. ప్రపంచ భౌతిక  సంపదలకు హెచ్చు తగ్గు లుంటాయి కాని జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది.అందుకు ఉదాహరణ విదురుడు కారణ జన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా పేరెన్నికగలవాడు. ధృతరాష్ట్రుడు వంటి వారికి నీతి బోధ చేసినవాడు. అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం. ఆయన జ్ఞానసంపద వలనే లోక ప్రసిద్ధం అయ్యాడు. అందుకే జ్ఞానసంపదే శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది.

మానవులు వికాసవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి, తమ జన్మను చరితార్ధం చేసుకోవడానికి అవసరమైన ప్రధాన సంపద జ్ఞాన సంపదేఆధ్యాత్మిక వేత్తల్ల నిశ్చితాభిప్రాయం. ఈ జ్ఞానసంపద గలవారు ధన, ధాన్య, గృహ, ధైర్య, వస్తు, వస్త్ర, వాహనాది సంపదల్లో కొన్నిటిని లేదా అన్నిటినీ ప్రయత్నంతో సమకూర్చుకొనగలుగుతా రు. కానీ, ధనధాన్యాది ఇతర సంపదలు గలవారు సులభంగా జ్ఞానసంపదను చేజిక్కించుకోలేరు. ఇతర సంపదలెన్ని ఉన్నా శ్రద్ధాసక్తులు, పట్టుదల, తగిన ప్రయత్నం లేకుండా జ్ఞానసంపద దరిచేరదు. లోకంలో ఎన్ని సంపదలున్నా అవేవీ జ్ఞానధనంతో సమానం కాలేవు. జ్ఞానధనమే ధనాలన్నిటిలోనూ ప్రధానమైనది. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం