కుర్తాళం పీఠాధిపతిచే 'అయ్యలసోమయాజుల'కు సత్కారం.

   విశాఖపట్నంలోని లాలితాపీఠం లో అంగరంగ వైభవంగా  తొమ్మిది రోజుల పాటు గురు ఆరాధన మహోత్సవాలు జూన్ 4 నుంచి  12 వరకు  కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ  సిద్ధేశ్వర భారతీనంద స్వామి గారు మరియు శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీనంద స్వామిని వారిచే  జరిగిన సందర్భంగా చివరి రోజు జరిగిన కవి సమ్మేళనం లో 
కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్   విశాఖపట్నం 
'గురవే సర్వలోకానాం' అన్న కవిత ద్వారా సమాజకల్యాణమే గురు ధ్యేయం అన్నది  చెప్పినప్పుడు పీఠాధిపతి  సిద్ధేశ్వరనంద స్వామి ఆశీర్వదిస్తు పూలదండ మరియు శాలువ  ద్వారా ఘనంగా సత్కరించారు
కార్యక్రమం ప్రముఖ సాహితీ వేత్త, కవి రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య టి.పి.ఎన్ ఆచార్యులు మరియు  సాహితీ విశ్లేషకులు విశ్రాంత ఆచార్యులు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారి ఆధ్వర్యంలో లలితా పీఠ ప్రాంగణంలో జరిగింది.
ప్రసాద్ మాష్టారుని సాహితీమిత్రులు మరియు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియచేశారు. బదులుగా  ప్రసాద్ మాష్టారు మంత్రద్రష్ట, నడయాడే కాలభైరవ స్వరూపులైన సిద్దేశ్వరానంద స్వామి చే ఆశీస్సులు పొందడం నా జీవితాన మరువలేనిది అని పూర్వజన్మ సుకృతం అని బదులిచ్చారు...!!
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం