నేను లేనిదే నీవు లేవు:::;- రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, హైదరాబాదు.
మీ తల్లికి తల్లిని నేనే...!
మీ తల్లి తో పాటు తల్లిని నేనే...!
మీ తల్లి తర్వాత కూడా తల్లినినేని...!

చెట్టును నేనే, పుట్టను నేనే...!
అందమైన గుట్టను నేనే...!
మట్టిని నేనే, దానితో వేసే కట్టను నేనే..!

నల్ల మబ్బుల ముంగురులలో నేనే...!
చల్లగాలికి మయూరాల నాట్యంలో నేనే...!
పైరగాలి వయ్యారాలలో నేనే...!

చినుకు చినుకు తుతుంపరలను నేనే...! 
దూరంగా జడివాన ధారలను నేనే...! 
ఏకమైన నీటి ప్రవాహంలో నేనే...!

సెలయేటి గలగలలో నేనే...!
ఎగిరేటి జలపాతంలో నేనే...!
చిరుగాలి సవ్వడిలలో నేనే...!

చెరువును నేనే...!
చెరువులో ఎగిరేటి చేపను నేనే...!
వాటికి నిలయమైన ఆవాసాన్ని నేనే...!

శక్తినిచ్చే కూడుని నేనే...!
సేదను తీర్చే నీడను నేనే...! 
నువ్వు కట్టుకున్న గూడును నేనే...?

అందమైన రాయిని నేనే...!
చందమైన రప్పను నేనే...!
అందులో పూజించే రూపాలను నేనే...!

ఎగసిపడే అలలకు గమ్యాన్ని నేనే...!
విష మలినాలకు ఆకలింపు నేనే...! 
మితిమీరితే ముంచే సునామిని నేనే...!

నీ విషపు సృష్టిలో ఆస్వాదాన్ని నేనే...!
నీ వికృత చేష్టలకు భరింపు నేనే 
నా పకృతి చేష్టలకు ఆకలింపును నేనే...!

ఊపిరైన ప్రాణవాయువు నేనే...! 
ఆయునైనా జీవధారను నేనే...! 
ఆదమరిస్తే మరణశయ్యను నేనే...!

నీ జీవితానికి ఆలనను నేనే...!
నీ జీవనానికి పాలనను నేనే...!
విర్రవీగి ఆదమరిస్తే నీ నాశనాన్ని నేనే...!

పాడెను నేనే...!
నిన్ను కాల్చే కాడు నేనే...!
చివరికి నీ కడసారి తల కొరివి కాడ నేనే...!

ధర్మాన్ని పాటిస్తే కాపాడేది నేనే...! 
అధర్మాన్ని నడిపిస్తే కాలరాసేది నేనే...! 
అర్థం చేసుకొని నడిస్తే ఆదరించేది నేనే...!

అందమైన ప్రకృతి నేనే...!
మానవ వికృతి పరిష్కారం నేనే...! 
ఆదమరిస్తే అంతం చేసేది నేనే...!

ఇన్ని నేనై ఉన్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకో...!
నన్ను నీవై తెలుసుకో...!
ఈ ప్రకృతిని తల్లిని కాపాడుకో...!


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం