సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-181
మధు మక్షికా న్యాయము
******
మధు మక్షికా అంటే తేనెటీగ.
"తేనెటీగ సేకరించిన తేనె మనుష్యుల పాలు అయినట్లుగానే మనుష్యులు సంపాదించిన సొమ్ము కానీ, కష్టం కానీ  ఇతరుల పాలు అవుతుందనే అర్థం వచ్చేలా ఈ "మధు మక్షికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు ."
కష్టపడి సంపాదించిన సొమ్ము పరుల పాలు ఎలా అవుతుందో చెప్పిన వేమన పద్యాన్ని చూద్దాం.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక /తాను తినక లెస్స దాచుగాక/ తేనెటీగ గూర్చి తెరువరికీయదా/విశ్వధాభిరామ వినురవేమ" 
తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించిన తేనెను దారిలో పోయే మనుషులెవరో  దోచుకు పోయినట్లు, తాను తినకుండా కష్టపడి దాన ధర్మాలు చేయకుండా కూడబెట్టిన ధనాన్ని ఎవరో ఒకరు దోచుకోకుండా ఉండరు  అని అర్థం.
అర్థం ఇదే అయినా  అహంకారి, పిసినారి సంపాదించిన సొమ్ము తాము తినలేరు. చివరికి వారి సొమ్ము ఇతరుల పరం అవక తప్పదని  కాకుత్సం శేషప్ప కవి  ఏమన్నారో చూద్దాం.
 "...విత్తమార్జన చేసి విర్రవీగుటె  కానీ/ కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు/ పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి/ దాన ధర్మము లేక దాచి దాచి/ తుదకు దొంగల కిత్తురో? దొరలకవునో?/ తేనె జుంటీగలియ్యవా  తెరువరులకు.."
 ఇవి రెండూ ఇంచుమించు దగ్గరగా ఉన్నా మరో కోణంలో చూస్తే ఎంతో మంది శ్రమ జీవులు అలుపెరుగని  కష్టం చేస్తుంటే ఆ కష్టం యొక్క  ఫలాలను సుఖ సౌఖ్యాలను  ఆధిపత్య రూపమైన యజమానులు పొందుతున్నారనే కోణంలో చెప్పవచ్చు.
 ఏది ఏమైనా  "కష్టమొకరిది సుఖం మరొకరిది" అని ఈ "మధు మక్షికా న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది కదండీ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం