శరణాగతి;- - యామిజాల జగదీశ్
 పరాశర భట్టు ఓరోజు అడవిలో పోతున్నారు. అక్కడ ఓ దృశ్యాన్ని చూసి స్పృహతప్పి పడిపోయారు. గురువుగారెంతసేపటికి తిరిగి రాకపోవడంతో శిష్యులు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారు.
కింద పడిపోయి ఉన్న గురువుగారిని చూశారు. ఆయనను ఇంటికి తీసుకొచ్చారు.
స్పృహలోకి వచ్చిన గురువుగారిని అడవిలో ఏమైందని అడిగారు శిష్యులు.
"నేనొక దృశ్యాన్ని చూడటంతోనే పడిపోయాను" అన్నారు గురువుగారు.
"ఏమిటా దృశ్యం" అని అడిగారు శిష్యులు.
అప్పుడు గురువుగారిలా చెప్పారు...
ఒక వేటగాడు ఓ కుందేలు పిల్లను పట్టుకున్నాడు. దానిని ఓ సంచిలో పెట్టుకున్నాడు. దానినో మూటలా భుజాన వేసుకుని పోతున్నాడు.
అది చూసిన కుందేలు తల్లి ఆ వేటగాడిని వెంబడించి అతని కాళ్ళను పట్టుకుని బతిమాలింది.
తన పిల్లను విడిచిపెట్టమని కోరింది.
తల్లి కుందేలు దీనావస్థను చూసి మనసు చలించిన వేటగాడు కుందేలు పిల్లను విడిచిపెట్టాడు.
ఇదంతా చూసి నేను స్పృహకోల్పోయానన్నారు గురువుగారు.
గురువుగారు చెప్పినదంతా విన్న శిష్యులు
"స్పృహ తప్పి పడిపోవలసినంత ఏముందండీ?" అని నెమ్మదిగా అడిగారు. 
అంతట గురువుగారు
"శరణాగతి ఎలా చెయ్యాలని ఆ కుందేలు తల్లికి ఎవరు చెప్పించారు? లేక శరణాగతి కోరితే వారిని కాపాడాలని ఆ వేటగాడికి ఎవరు చెప్పించారు? కుందేలు శరణాగతిని మన్నించి వేటగాడు కుందేలు పిల్లను విడిచి పెట్టడం సామాన్యమైన విషయం కాదు. వేటగాడి కరుణ అసామాన్యం. శరణాగత వత్సలుడైన స్వామివారిని నువ్వే నాకు దిక్కు అని వేడితే  ఎంతలా అనుగ్రహిస్తాడో కదా?! దేవుడు మనల్నెప్పుడూ విడిచిపెట్టడు. తప్పక కాపాడుతాడనే నమ్మకం నా మనసులో ఇంకా కలగలేదేమిటాని నా బాధ. అందుకే స్పృహతప్పి పడిపోయాను" అన్నారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం