ఔను, తల్లీకొడుకులు ప్యాసయ్యారు!;- - యామిజాల జగదీశ్
 మహారాష్ట్రలో పదవ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. అవును పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వెలువడుతాయి...ఇది మామూలే. చెప్పుకోవడానికేముంది అనొచ్చు. కానీ విషయం ఉంది కాబట్టే ఈ నాలుగు మాటలూ చెప్తున్నాను. 
2022 - 23 విద్యా సంవత్సరం కోసం మహారాష్ట్ర సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో తల్లీ కొడుకులు ప్యాసవడం విశేషం. ఈ పరీక్షా ఫలితాలు జూన్ రెండున వెలువడ్డాయి.
43 ఏళ్ళ తల్లి మోనికా తెలంగే 51.8 శాతం మార్కులతోను, ఆమె కొడుకు మందన్ తెలంగే 64 శాతం మార్కులతోను పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.  పూణెలోని హదప్సర్ ప్రాంతంలో ఉంటారీ తల్లీకొడుకులు. 
మోనికా చెత్తను సేకరించే పని చేస్తుంటారు. 
శ్రద్ధగా చదువుకుంటే మరో పనికి పోవచ్చనుకున్న మోనికా చదువుపట్ల దృష్టి మళ్ళించారు. ఓవైపు పని చేసుకుంటూనే పరీక్షలకు సన్నద్ధమయ్యారు.
పదవ తరగతి చదువుతున్న తన కొడుకుకి వాట్సప్ గ్రూపులో ఆయా సబ్జెక్టులకు సంబంధించి వచ్చిన విషయాలను తానూ చదువుతుండేవారు తల్లి మోనికా. ఈ విషయాన్ని గమనించిన కొడుకు తల్లికి అన్ని విధాలా సహకరించాడు.
మోనికా మాట్లాడుతూ "నేను చెత్త ఊడ్చే పని చేస్తున్నాను. చదువుగానీ ఉండి ఉంటే ఇంకేదైనా మంచి నౌకరీకి వెళ్ళి ఉండేదాన్ని కదా అనుకున్నాను. ఆ అవకాశం కోసమే చదువుతున్నానని మా అబ్బాయితో చెప్పానొకరోజు. అప్పటి నుంచి వాడు తన వంతు సహకారమందించాడు.అంతేకాదు, నాతో పని చేస్తున్నవారుకూడా నన్ను ప్రోత్సహించారు. చదువుతున్నాను గానీ పరీక్ష రాస్తే ప్యాసవుతానా అనే సందేహం ఉంటూ ఉండేది. కానీ నా మార్కులు చూసేసరికి నా ఆనందానికి అంతులేదు. నా కొడుకు పాత్ర ఇందులో ఎక్కు శాతం ఉంది. వాడు చదువుకుంటూ నేనెలా చదువుకోవాలో చెప్తుండేవాడు. ఒక్కొక్క రోజు ఇప్పుడది అవసరమా అని నీరసపడినప్పుడల్లా నన్ను ఉత్సాహపరిచేవాడు. చదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదు అని నేను నా ప్యాసైన తీరుని నాకు తెలిసిన పది మందికీ చెప్తున్నాను. నర్సుగా పని చేయాలనుంది. పన్నెండో తరగతి పరీక్షలుకూడా రాసి  నర్సింగ్ కోర్సులో చేరాలని ఉంది" అని చెప్పారు. ఆమె మాటల్లో కొండంత ఆత్మవిశ్వాసం ఉంది. ఆనందమూ ఉంది.
ఇలావుండగా ఆమె కొడుకు మందన్ మాట్లాడుతూ తాను నీట్ పరీక్షలకు ప్రిపేరవుతున్నానన్నాడు.  తనకు డాక్టరవ్వాలని ఉందన్నాడు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం