సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -163
భావార్థాధికరణ న్యాయము
****
భావము అంటే అభిప్రాయము,మనో వికారము, ఆత్మ, పుట్టుక,ధాత్వర్థ రూప క్రియ, స్వభావము, అర్థ కారణము, ఉనికి,అగుట,కలుగుట, స్థితి, పద్ధతి,భక్తి,నిష్కపటము, తలంపు,ప్రేమ, సారము, నిశ్చయము, హృదయము, ధ్యానము,మోహాభినయము, ప్రపంచము, జ్ఞానేంద్రియము,జాతకములోని 12 గృహములు... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. 
అధికరణము అంటే ఆధారము 
ఆర్థికము అంటే అర్థి సంబంధమైనది,నిజమైనది, వివేకము కలది అని అర్థం.
ఆధి అంటే మనో వ్యధ,కుదువ లేక తాకట్టు.
 భావార్థాధికరణము అంటే  భావాలకు ఆధారము మనసు.అది ఎట్లా భావిస్తే అట్లా ఉంటుంది అని అర్థం. 
మనం ఎట్లా భావిస్తే అట్లా ఉంటుంది కాబట్టి స్వర్గంగా భావించుకోవాలి. అది ఎట్లా,దేని చేత అని ఆలోచించాలనే అర్థంతో ఈ న్యాయము ముడిపడి ఉంది.
దీనికి సమానార్థం వేదంలో "యద్భావం తద్భవతి" అని చెప్ప బడింది.
అంటే మనసులో దేనిని నింపుకుంటామో వాటిని బట్టే మన దృష్టి, ఆలోచనలు,చేతలు, ఉద్దేశాలు, అంచనాలు ఆధారపడి ఉంటాయి. ఆ భావనల ధోరణే వాస్తవ రూపం దాలుస్తుంది.
ముందుగా మన మనసులో భయమా,భక్తా, ఈర్ష్యా,అసుయా,ధైర్యమా,నిరాశా, నిస్పృహ ‌.. వీటిలో ఏది నింపుకున్నామో గ్రహించాలి.
మనసును మభ్యపెట్టుకోకుండా మంచి   పనిని గురించి తీవ్రంగా వాంఛిస్తే, త్రికరణశుద్ధిగా నమ్మితే, నిశితంగా పరిశీలించి ఆలోచిస్తే,  నిరాశ నిస్పృహలకు తావు లేకుండా ఉత్సాహంతో ప్రయత్నం చేస్తే ఏదైనా తప్పకుండా జరిగి తీరుతుంది.
దీనికి సంబంధించిన ఓ కథ ఉంది. ఓ వ్యక్తి భగవంతుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమై మూడు సార్లు ఏం కోరుకుంటే అదే జరుగుతుందని  వరమిస్తాడు.
ఆ వ్యక్తి వెంటనే రాజ భవనము లాంటి భవనం కోరుకోగానే వెంటనే రాజభవనము, రెండోసారి అందమైన అమ్మాయితో వివాహం అనగానే వివాహం అవుతుంది. ఇవి రెండూ జరిగే సరికి సంభ్రమాశ్చర్యాలకు లోనైన ఆ వ్యక్తి  ఇవన్నీ మాయమైతే ఎలా అనుకుంటాడు. అంతే మరుక్షణమే ఉన్నవన్నీ మాయమై పూర్వపుస్థితికి వచ్చేస్తాడు.
దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఫలితాలు అలానే ఉంటాయనేది ఈ కథలోని నీతి.
ఈ భావాన్నే శ్లోకంలో "యాదృశ్రీ భావనా యత్ర సిద్థిర్భవతి తాతృశి" అంటారు వేదాంతులు.
మహా భారతంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా చూద్దామా!
ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి వాళ్ళను వెతికి తీసుకుని వస్తే అమూల్యమైన వరాలను ఇస్తాను అంటాడు.
అలాగే ధర్మరాజును పిలిచి  చెడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే, వారిని తీసుకుని వస్తే అమూల్యమైన వరాలు ఇస్తాను అంటాడు.
దుర్యోధనుడు, ధర్మరాజు  ఇద్దరూ వెతకడానికి వెళ్తారు.
దుర్యోధనుడికి ఒక్కరు కూడా మంచి వారు కనబడరు. అలాగే ధర్మ రాజుకు ఒక్క  చెడ్డ వాడు కూడా కనబడడు.అదే విషయాన్ని శ్రీకృష్ణుడికి చెబుతారు.
దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనలో మంచితనం ఉంటే మనకు అందరిలో మంచితనమే కనబడుతుంది. మనలో చెడు భావనలు ఉంటే అందరూ చెడుగానే కనబడతారు. 
"భావార్థాధికరణ న్యాయము" అంటే ఇదేనని  పై ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం కదా!
మన మనసులో ఇంకా ఏ మూలనైనా చెడు భావనలు ఉంటే వాటిని తొలగించుకుందాం. ఆ ఖాళీని కూడా మంచి మానవతా విలువలతో నింపుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం