కృతజ్ఞత అనేది అన్ని గుణాలలోకెల్లా అత్యుత్తమ గుణమని శాస్త్రం ప్రభోదిస్తొంది.మనకు అవసరార్ధమైన పరిస్థితులలో అడిగిన తడవుగా సహాయం అందించేవారు వుంటారు. మరికొందరు మన అవసరం గ్రహించి అడగకపోయినా సహాయం అందిస్తుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై వుండాలి. ఒకనాడు మనకు మేలు చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు కష్టాలలో వున్నట్లు తెలిస్తే, అడగకపోయినా వెళ్ళి సహాయం చేయడం మన కర్తవ్యం . కృతజ్ఞత అనేది అత్యుత్తమ సంస్కారాలలో ఒకటిగా భావిస్తారు.
ఈ కలియుగంలో కృతజ్ఞత అనేది మృగ్యంగా మారింది. అవసరంలో సహాయం అందుకొని, అనంతరం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన సహాయం చేసిన వారిని మర్చిపోవడం, వారు ఎదురుపడినా తప్పించుకు తిరగడం సర్వసాధారణమైపోతొంది. అవసరమని వేడుకోవడం, అవసరంలో వాడుకోవడం, అవసరం తీరాక ఆడుకోవడం మానవ సహజ ప్రవృత్తిని అయిపోయింది. ఇక కృతజ్ఞతకు తావెక్కడిది ?అందువలన మనుష్యులపై, మానవత్వంపై నమ్మకం తగ్గుతొంది.
అత్మోపనిషత్ మనకు మేలు చెసిన సాటి మానవులతో పాటు ఈ సృష్టిలో మన మనుగడకు కారణమైన పశువులు,పక్షులు,క్రిమికీటకాదులు, చెట్లు, చెమలు అన్నింటికీ కృతజ్ఞులమై వుండమని చెబుతొంది. శత్రువైనా సరే వారి మేలును కాంక్షిస్తూ,కృతజ్ఞత, దయ కలిగి వుండమని చెబుతొంది. ముఖ్యంగా మనకు జన్మనిచ్చి, మన అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన తల్లిదండ్రుల ఋణం ఏనాటికీ తీర్చుకోలేనిది.వారిని వృద్ధ్యాప్యంలో వదిలేసి కృతఘ్నత భావం కలిగివుండడం అన్ని పాపాలలో కెల్లా మహా పాపం అని వేదం చెబుతోంది.
మనకు మేలు చేసిన వారిపై కృతజ్ఞత కలిగి వుండడం కొంతవరకు సులువే కాని మనకు కీడు చేసిన వారిపై కుడా కృతజ్ఞత కలిగి ఉండడం జరిగే పనేనా అన్న ప్రశ్న జనిస్తుంది. కాని ఇందుకు సమాధానం కుడా అత్మోనిపరిషత్ చెబుతొంది. భగవంతుడు సృష్టించిన సకల జీవులపై సమదృష్టి కలిగి, అందరినీ ఒకే విధంగా అంతే ఆత్మదృష్టితో చూడగలిగితే స్నేహితులు, శత్రువులు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అపకారులకు కుడా మేలు చేసే సహృదయత అలవరచుకొని కృతజ్ఞతాభావం ప్రకటించగలుగుతారు.
కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది.డబ్బుకు మనం ఇచ్చే విలువ మనల్ని సకాలం లో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఏర్పరుస్తుంది.
అందువలన మనల్ని అధమ పాతాళానికి తొక్కేసే అత్యాశ, గర్వం, అహంకారం లను వదిలి, సుగుణాలైన సంతృప్తి , కృతజ్ఞతాభావాలను అలవరచుకునేందుకు కృషి చేయాలి
ఈ కలియుగంలో కృతజ్ఞత అనేది మృగ్యంగా మారింది. అవసరంలో సహాయం అందుకొని, అనంతరం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన సహాయం చేసిన వారిని మర్చిపోవడం, వారు ఎదురుపడినా తప్పించుకు తిరగడం సర్వసాధారణమైపోతొంది. అవసరమని వేడుకోవడం, అవసరంలో వాడుకోవడం, అవసరం తీరాక ఆడుకోవడం మానవ సహజ ప్రవృత్తిని అయిపోయింది. ఇక కృతజ్ఞతకు తావెక్కడిది ?అందువలన మనుష్యులపై, మానవత్వంపై నమ్మకం తగ్గుతొంది.
అత్మోపనిషత్ మనకు మేలు చెసిన సాటి మానవులతో పాటు ఈ సృష్టిలో మన మనుగడకు కారణమైన పశువులు,పక్షులు,క్రిమికీటకాదులు, చెట్లు, చెమలు అన్నింటికీ కృతజ్ఞులమై వుండమని చెబుతొంది. శత్రువైనా సరే వారి మేలును కాంక్షిస్తూ,కృతజ్ఞత, దయ కలిగి వుండమని చెబుతొంది. ముఖ్యంగా మనకు జన్మనిచ్చి, మన అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన తల్లిదండ్రుల ఋణం ఏనాటికీ తీర్చుకోలేనిది.వారిని వృద్ధ్యాప్యంలో వదిలేసి కృతఘ్నత భావం కలిగివుండడం అన్ని పాపాలలో కెల్లా మహా పాపం అని వేదం చెబుతోంది.
మనకు మేలు చేసిన వారిపై కృతజ్ఞత కలిగి వుండడం కొంతవరకు సులువే కాని మనకు కీడు చేసిన వారిపై కుడా కృతజ్ఞత కలిగి ఉండడం జరిగే పనేనా అన్న ప్రశ్న జనిస్తుంది. కాని ఇందుకు సమాధానం కుడా అత్మోనిపరిషత్ చెబుతొంది. భగవంతుడు సృష్టించిన సకల జీవులపై సమదృష్టి కలిగి, అందరినీ ఒకే విధంగా అంతే ఆత్మదృష్టితో చూడగలిగితే స్నేహితులు, శత్రువులు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అపకారులకు కుడా మేలు చేసే సహృదయత అలవరచుకొని కృతజ్ఞతాభావం ప్రకటించగలుగుతారు.
కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది.డబ్బుకు మనం ఇచ్చే విలువ మనల్ని సకాలం లో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఏర్పరుస్తుంది.
అందువలన మనల్ని అధమ పాతాళానికి తొక్కేసే అత్యాశ, గర్వం, అహంకారం లను వదిలి, సుగుణాలైన సంతృప్తి , కృతజ్ఞతాభావాలను అలవరచుకునేందుకు కృషి చేయాలి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి