ఓటమి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు  లతగీత బడి నుంచి వచ్చారు. "అమ్మా!స్లీప్ టెస్ట్ లో  20/20 తెలుగు లో " అందిలత! "నాకు 15/20"కసికోపంగా ఉంది గీత గొంతు. ఔనుమరి ఇద్దరూ కవలపిల్లలు. తల్లి అంది" ఫర్వాలేదు. ఈసారి నీవూ తెచ్చుకోగలవు.ఒకరితో పోల్చుకోవడం తప్పు. మీకు దివ్యామిశ్ర అనే ఓ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ గూర్చి చెప్తాను వినండి. ఆమె కాన్పూర్ నివాసి. తండ్రి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్. తమ్ముడు దివ్యాంష్ సైన్యంలో లెఫ్టినెంట్. అప్పుడే ఉరి ప్రాంతంలో దుండగుల దాడి జరిగింది. తనుకూడా ఏదో చేసి సాధించాలని కంకణం కట్టుకుంది.  ఎన్నో సార్లు యు.పి.ఎస్సీ పరీక్షలలో ఫెయిల్ ఐంది. ఇలామూడు నాల్గుసార్లు జరిగింది.పి.హెచ్ డి చేస్తూ 6_7గంటలు రోజు చదివేది.మూడోసారి 28 వరాంక్ పొంది యు.పి.లో ఐ.ఎ.ఎస్.గా సెలక్ట్ ఐంది. ఒకరితో పోల్చుకోవడం ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ తో బాధపడటం తగదు.మీరు కవలపిల్లలు ఐనా  ఒకరకంగా మార్కులు ఉద్యోగాలు వస్తాయి అని భావించరాదు..ఎవరిశక్తి ప్రతిభ వారిది" అని ఓదార్చింది. అంతే  పిల్లలిద్దరూ నవ్వుతూ ఆడుకోడానికి బైట కి తుర్రుమన్నారు🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం