విద్య!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
దేవుడైన
నిన్ను నిలబెట్టి నిలబెట్టి
నీకు దర్శనం ఇస్తాడు!!!
కానీ
నిజాయితీగా తను నిలబడి
మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టేవాడు
ఈ ప్రపంచంలో
ఉపాధ్యాయుడు ఒక్కడే!!?

ప్రపంచాన్ని చంపింది ప్రపంచాన్ని మోసం చేసింది
ప్రపంచాన్ని అమ్మింది ప్రపంచాన్ని విడదీసింది-ధనం‌

కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది
ప్రపంచాన్ని ఆధునికరించింది
ప్రపంచాన్ని గ్రహాలను సముద్రాలను దాటించింది_-విద్య
ప్రపంచానికి సౌకర్యాన్ని సౌందర్యాన్ని సంతోషాన్నిచ్చింది-విద్య

ఇప్పుడు
ధనం కన్నా విద్యా ధనమే నిజమైన ధనం!!

ఊరు ఊరుకు వాడవాడకు ఓ దేవుడున్నాడు!!
కానీ మనిషి లేడు!!
ఊరు ఊరుకు వాడవాడకు ఒక బడి ఉంది
అక్కడ ఉన్నది ఓ ఉపాధ్యాయుడు
అక్కడ ఉన్నది ఒక వీరుడు విద్యార్థి!!!

దేశ రక్షణకు బడ్జెట్ ఎంత ముఖ్యమో
దేశ శిక్షణకు అంత ధనం ముఖ్యం
అంత విద్యాదానం ముఖ్యం!!!!!!!!?

ప్రతి విద్యార్థి మళ్ళీ ఓ ఉపాధ్యాయుడై
పదేళ్లయిన పసిపిల్లలకు
ప్రత్యేక నైపుణ్యాలను ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వాలి!!?

చదువు అంటే పని కాదు
చదువు అంటే మనీ కాదు
చదువు అంటే ఒక బంగారు గని!!!?

మనిషి
అశ్వాన్ని మాత్రమే స్వారీ చేయగలడు
విద్యావిశ్వాన్ని మొత్తం స్వారీ చేస్తుంది!!!

కలల్ని నిజం చేసేది
మనసు కాదు మనిషి కాదు
కలల్ని నిజం చేసేది
నీవు నేర్చుకున్న విద్య మాత్రమే!!!!

ఇంతకుముందు
ధనవంతులు అనుకున్న వాళ్లు
గొప్పవాళ్లు అనుకున్న వాళ్లు అందరూ
ఇప్పుడు ఓడిపోయారు

బడి ముందు బడిపంతుళ్ళ ముందు
విద్య ముందు విజ్ఞానం ముందు!!!!!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన కవిత

Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం