సరదా సంగతులు!అచ్యుతుని రాజ్యశ్రీ
 "తాతా!మాబడిలో పాఠాలు ఇంకా మొదలు పెట్టలేదు. తమాషా సరదావిషయాలు రేపు క్లాస్ లో చెప్పాలి.ప్లీజ్!అలాంటి రెండు నిజసంఘటనలు చెప్పవు?" శివా సాయి అడిగారు."అలాగే! జర్మనీ కి చెందిన రిచర్డ్ ప్లాట్జ్ ఒక సీసాలో పోస్ట్ కార్డు ని పెట్టి  దాన్ని సముద్రం లోకి విసిరాడు. ఒక చేపలు పట్టేవాడికి దొరికింది. దాన్ని అతను కూడా గిరాటేశాడు.కొంత మంది కి సముద్ర తీరం లో ఆసీసా దొరికింది. కుతూహలంగా దాని మూతతీశారు.లోపల రిచర్డ్ రాసిన కార్డ్ కనపడితే దాన్ని చదివారు.అందులో ఇలారాసి ఉంది "దీన్ని చూసిన వారు బెర్లీన్ లోని అడ్రస్ కి అందజేయండి" ఆఅడ్రస్ ఆధారంగా ప్లాట్జ్ కుటుంబాన్ని కలుసుకుని అతని మనవరాలు 62ఏళ్ళ యాంజెలాకు ఇచ్చారు. 
కేవలం కుక్కలు ఆవులు మాత్రమే కాదు బర్మీస్ పైథాన్ అనే పామును ఎక్కడో విడిచి పెడితే తిరిగి అదిమూడు మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి తన స్వంత గూటికి చేరింది. దాని కి అంత జ్ఞాపకశక్తి ఉంది అన్న మాట. " తాత మాటలకి పిల్లలు సంతోషంగా అరిచారు "రేపు ఈరెండు యధార్థ సంఘటన లు  మాక్లాస్ లో చెప్తాం తాతా!"🌹      

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం