లక్ష్య సాధన మీదే గురి; - సి.హెచ్.సాయిప్రతాప్
 ప్రపంచంలోని ప్రతి మనిషికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాల దాటుకుంటూ.. లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన లొంగిపోకూడదు.. కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం. విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి. ప్రతీ శ్వాసలోనూ తాము నిర్దేశీంచుకున్న లక్ష్యాన్నే గుర్తు చేసుకుంటూ వుండాలి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన అవరోధాలు:  ఒకటి అత్యాహారం, రెండవది అనవసర ప్రయాస, మూడవది వ్యర్థ సంభాషణ చేయడం, నాలుగవది నియమాలను మొక్కుబడిగా పాటించడం, ఐదవది దుష్ట జనసాంగత్యం, ఆరోది అత్యాశ. ఈ అవరోధాలను అతిశులభంగా దాటాలంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 'పరం దృష్ట్వా నివర్తతే' అనే మాటను ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి.  ఎప్పుడైతే మనిషి ఉన్నత విషయాల అనుభూతిని పొందుతాడో అప్పుడు అల్ప విషయాల నుండి బయటపడతాడు. ఈ నేపధ్యంలో ఎడసన్ జీవితంలో జరిగిన ఒక ముఖ్య విషయాన్ని మననం చేసుకోవడం ఎంతో అవసరం.
ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి ముందు 3000 సార్లు విఫలమయ్యారు.
బలమైన కోరిక, దృఢ నిశ్చయం మాత్రమే లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ తన లక్ష్యాలను చేరుకునే దిశలో ఎడిసన్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది కూడా పరిశీలించవలసిన ముఖ్య విషయం.
ఆయన ఒక ప్రయోగం విఫలమవ్వగానే మరో ప్రయోగానికి గాలివాటంగా మళ్లలేదు. విఫలమైన ప్రతీసారి తన ఆలోచనలను తానే విశ్లేషించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగారు.
"ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుని, అది విఫలమయ్యేవరకూ దాని మీదే పని చేస్తాను. అది విఫలం అయ్యిందని తెలిసాక మరో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను" అని ఎడిసన్ 1890లో హార్పర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం