వయసు తో పనిలేదు! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆరోజు పిల్లలు బడి నుంచి ఇంటికి వస్తూనే "అమ్మమ్మా!నీవు కూడా మాతో చదవాలి.టెన్త్ పాస్ కావాలి"అని గోల గోల గా  అరవసాగారు."నామొహం!ఈ వయసులో 55ఏళ్ళ దాన్ని  చిందులు!?" అమ్మమ్మ నవ్వుతూ అంది.అంతే జయ అంది"ఈరోజు మా టీచర్ మహారాష్ట్ర కి చెందిన ఓ అమ్మమ్మ గూర్చి చెప్పారు. కల్పన అనే 53ఏళ్ళ మహిళ  10వక్లాస్ 79.60%తో పాసైందిఆమె కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ స్వయంగా చెప్పాడు.ఆకుర్రాడు ఫారిన్ నించి ఇండియా వచ్చాక తెలుసు కున్నాడు.నైట్ స్కూల్ కి వెళ్లి చదువు కుంది ఆమె.అబ్బాయి పెళ్లి ఫిబ్రవరి  ఐనా ఆమె పనులు చేస్తూ రాత్రి చదివి మార్చిలో పరీక్ష రాసి పాసైందిఆమె.తన తల్లి గూర్చి ఇలా అన్నాడు " మొదలు పెట్టిన పని కష్టం నష్టం వచ్చినా చేసి తీరాలి. లైఫ్ అంటే అదే మరి.మనసు లగ్నం చేసి పని చేసి తీరాలి. ఆమె పూర్తి పేరు  కల్పనా అచ్యుత్"2021లో చదువు మొదలెట్టింది. అమ్మమ్మ నవ్వుతూ అంది "పిచ్చి పిల్లలూ! నేను ఎసెల్సీ పాసైనాను. కాకపోతే మీలాగే ఇంగ్లీష్ టకటకా మాట్లాడలేను".అంతే ఆశ్చర్యంగా ఆమెవంక చూశారు పిల్లలు 🌹

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం