ఆస్తీకునిజననం(పురాణకథ)డా.బెల్లంకొండనాగేశ్వరరావు


 జరాత్కారుడు బ్రహ్మచర్య నియమంతో తపోదీక్షకొనసాగిస్తూ అరణ్యాలలో పయనిస్తుండగా,కొందరు ఒక చెట్టుకొమ్మకు తల్లకిందులుగా వేళ్లాడుతూ కనిపించారు.వారివద్దకువెళ్లి "ఎవరుమీరు ఎందుకు ఇలాఉన్నారు'' అన్నాడు. "నాయనా మేము నీపూర్వీకులం నీవు వివాహం చేసుకుని సంతానాన్ని పొందితే మాకు స్వర్గం ప్రాప్తిస్తుంది"అన్నారువాళ్లంతా."మీకు ఈబాధ త్వరలో తప్పుతుంది.నారేరు కలిగిన యువతినే వివాహం చేసుకోవాలి  అనె నియమం కలిగిఉన్నాను "అంటూ తనపేరు కలిగిన యువతిని అన్వేషిస్తూ ఉన్నాడు.

ఒక రోజు ఓ యువతి తో వచ్చిన యువకుడు జరత్కారుని దర్శించి నమస్కరించి"మహానుభావ నేను నాగజాతి రాజును నాపేరు వాసుకి ఈమెనాసోదరి "జరత్కారువు" తమరు నాసోదరిని వివాహంచేసుకుని ఇరువంశాలను ఉద్ధరించండి"అన్నాడు వినయంగా.అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నజరత్కారుడు మెదటిరోజు"దేవి నేటినుండి నామనసు కువ్యెతిరేకంగా,నన్నునొప్పించేలా నీవు ప్రవర్తిస్తే ఆక్షణమే నిన్ను వదలి వెళతాను"అన్నాడు." "అలాగే స్వామి "అన్నది ఆమె.కాలక్రమంలో   జరాత్కారువు గర్బవతి అయింది. ఒక రోజు బాగా అలసిన జరత్కారుడు ఓచెట్టునీడన తనభార్య తొడపై తలపెట్టి ,సాయంకాలం ఆదమరచి నిద్రపోసాగాడు.కొంతసేపటికి సూర్యుడు పడమటికనుమల కు చేరువకాబోతున్నాడు.అదిచూసినఆమె తనపతి సంధ్యాసమయంలో జరుపవలసిన వేదవిహిత కర్మలకు ధర్మ లోపంఏర్పడుతుంది.కాని నిద్రలేపితే కోపగించుకుంటారని భయపడుతూనే జరత్కారుని నిద్రలేపింది. సుఖ నిద్రకు భంగంవాటిల్లడంతో కోపంగా"నాకు నిద్రాభంగం ఎందుకు కలిగించావు" అన్నాడు."స్వామి సంధ్యాసమయం అయింది.తమరు విధ్యుక్తకర్మలు జరపాలి కదా"అంది."వెర్రిదానా నేనునిద్రపోతుండగా అస్తమించడానికి సూర్యునికి ఎన్నిగుండెలుకావాలి! నాభార్యవై ఉండి ఈమాత్రం గ్రహించలేకపోయి నన్ను అవమానించావు.కనుక నానియమం ప్రకారం నిన్ను వదలివేస్తున్నాను.అయితే యింతకాలం నీవు నాపట్లచేసిన సేవలు నాకెంతోసంతోషాన్నికలిగించాయి.నీకు సూర్యసమప్రభావుడైన పుత్రుడు జన్మిస్తాడు వానికి ఆస్తీకుడు అనేపేరుపెట్టు ఉభయుల వంశాలను ఉధ్ధరిస్తాడు.నువ్వు నీఅన్నవద్దకువెళ్లు"అనిచెప్పి తనదారిన తానువెళ్లిపోయాడు.అలాజన్మించిన ఆస్తీకుడు జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని ఆపి తనతల్లి తరపు బంధువులైన నాగజాతిని రక్షించాడు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం