"వెన్న దొంగ";- - యామిజాల జగదీశ్
కృష్ణుడు మొదటిసారిగా వెన్న దొంగిలించిన విషయం ఆసక్తికరమైనది. 
కృష్ణుడు చిన్నోడిగా ఉన్నప్పుడు తల్లి యశోద కృష్ణుడికి అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా వెన్న ఇచ్చేది. కృష్ణుడికి వెన్న రుచి ఎంతో ఇష్టం.
 
వెన్న ఎక్కడి నుంచో రావడంవల్లే కాబోలు అమ్మ తనకు కొద్ది కొద్దిగానే వెన్న ఇస్తోందనుకున్నాడు కృష్ణుడు. 
కానీ ఓమారు కృష్ణుడు, బలరాముడు పాక్కుంటూ పాక్కుంటూ ఓ గదివైపు వెళ్ళారు. ఆ గది చీకటిగా ఉంది. లోపల ఏముందాని చూడ్డానికి వెళ్ళారు. అక్కడ బోలెడన్ని కుండలు కనిపించాయి. వాటిలో ఏముందో చూడాలన్పించింది. మెల్లగా ఓ కుండలోకి చెయ్యి పెట్టగా వెన్న ఉండటం తెలిసింది. అంతే అమాంతం ఇద్దరూ కుండలోంచి వెన్నను తీసి తినడం మొదలుపెట్టారు.ఇంట్లో ఇంత వెన్న పెట్టుకుని అమ్మ కొద్దకొద్దిగా ఇవ్వడమేంటని అనుకుని ఆట్లాడటం మాని వెన్న తిన్నారు.
ఇంతలో పిల్లల్ని వెతుక్కుంటూ యశోద అక్కడికి వచ్చింది. 
కృష్ణుడు వేసుకున్న ఆభరణాల మెరుపులలో వెన్నను చూసింది యశోద.
"ఏంటీ వెన్నను దొంగిలించి తింటున్నావా" అని అడిగింది యశోద.
వెంటనే కృష్ణుడు ఏం చెప్పాలో తెలీక "అబ్బే లేదమ్మా... నన్ను ఆభరణాలతో అలంకరించావుగా.... ఈ ఆభరణాలతో నా దేహం వేడెక్కిపోయింది. చల్లబడటం కోసం వెన్నకుండలో చేతులుపెట్టా" నన్నాడు. 
"మరి నీ బుగ్గల నిండా నోటినిండా వెన్న ఉండటమేమిటీ?" అని అడిగింది యశోద.
 
అయ్యో దొరికిపోయాం కదా అనుకున్న కృష్ణుడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు. 
"చీకటిగా ఉన్న ఈ గదిలో చీమలు నామీద పాకుతుండటం తెలీలేదు.  చీమలు నా బుగ్గలను కుడుతుంటే చురుక్కుమన్పించింది. వాటిని నా వెన్న  చేతులతో తోసానమ్మా. ... అందుకేనమ్మా నా బుగ్గలనిండా వెన్నంటుకుదమ్మా" అన్నాడు కృష్ణుడు.
అయ్యో...నా కృష్ణుడ్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానుగా అనుకుంటూ యశోద కృష్ణుడ్ని ప్రేమతో ఎత్తుకుంది.
అప్పుడు కృష్ణుడు  "నేను అమ్మను అబద్ధాలాడి నమ్మించాను కదూ. అయినా అదంతా వెన్న కోసమే కదా....నాకేమో వెన్న మరీ మరీ ఇష్టం..." అనుకుంటూ ఇక ఎవరింట్లోనైనా వెన్న దొంగిలించి ఏదో ఒకటి చెప్పి అమ్మను నమ్మించొచ్చు అనుకున్నాడు.
ఇలా కృష్ణుడు మొదటిసారి తన ఇంటే వెన్న దొంగిలించి తిన్నాడు. 
 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం