ప్రకృతి తో ఆరోగ్యం!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఫీసు నించి వచ్చిన నాన్న రంకెలేయసాగాడు"ఛ..ఛ..అస్సలు బుద్ధి లేకుండా పోతోంది. బైట ఇసుక లో ఏమిటా ఆటలు?" పాపం పిల్లలు బిక్కమొహం వేశారు. తాత అన్నాడు " అదేంట్రా అలా విసుక్కుంటావు?నీవు చిన్నప్పుడు పశులపాక చుట్టూ తిరుగుతూ దాక్కునేవాడివి.
అసలు గోశాలలో ఆవుపే డ మూత్రం వల్ల వ్యాధిక్రిములు నశిస్తాయి.  మైల ఏవైనా దీర్ఘవ్యాధులు వస్తే  గోమూత్రం పేడతో ఇల్లు శుభ్రం చేసేవారు. 
మడ్ బాత్ అని ఇప్పుడు మసాజ్ కేంద్రాల్లో చేస్తున్నారు. అసలు గంగానది మట్టి నీరు పవిత్రమనే మనం తెచ్చుకుంటున్నాంకదా? ప్రాచీన కాలంనించీ అన్ని దేశాల్లో మడ్ థెరపీ    మడ్బాథ్ రోజూ చేసేవారు. గంగానది మట్టి లోఎక్టినోమైసిటెస్ అనే జీవాణువులు ఉన్నాయి.సీజన్స్ ని బట్టి ఇవి త్వరగా మారుతూ రోగనిరోధక శక్తి ని కలిగిస్తాయి.పూర్వం సబ్బులు లేవు.తెల్లారుఝామునే లేచి నదిదగ్గరున్న మట్టి ని ఒంటికి నలుగుపెట్టి సూర్యనమస్కారాలు చేస్తూ స్నానం జపంచేసి ఇంటికి బైలు దేరేవారు.  రైతులు కూలీలు కూడా అలాగే పనుల కి వెళ్లేవారు. అందుకే అంత ఆరోగ్యం గా ఉండేవారు. మనం యోగాదినం అని జరుపుతున్నాం.ఇవాల్టినుంచి పార్క్ లో సాయంత్రం గంట సేపు ఆడాలి పిల్లలంతా!" తాత ఉపన్యాసం తో నాన్న నోరు మూత బడింది.పిల్లలు ఆనందంగా గంతులేయసాగారు🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం