సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -169
భూ శైత్యౌ ష్ణ్య న్యాయము
*****
భూ అంటే భూమి, పుడమి, అవని ,నేల ధరణి,ధరిత్రి మొదలైన అర్థాలు ఉన్నాయి.
శైత్యము అంటే చల్లదనం.ఔష్ణ్యం అంటే వెచ్చదనం.
భూమి చల్లదనమును, వెచ్చదనమును కూడా కలిగి వుంటుందని అర్థం. 
భూమి యొక్క స్వాభావిక గుణము గంధవత్త్వము. అనగా ఒక రకమైన పరిమళం  కలిగి ఉండటం.అందుకే భూమిని "గంధవతీ పృథివీ" అంటారు.తనకంటూ ప్రత్యేకమైన పరిమళం కలిగి ఉన్ననూ, హిమాదుల వలన చల్లబడటంతో చల్లదనమునూ,ఎండ వేడిమి మొదలగు వాని మూలమున ఉష్ణత్వమును కూడా కలిగి వుంటుంది.
 ఈ విధంగా భూమికి ఉన్న స్వాభావిక గుణము కాకుండా ఇతరముల వల్ల "చల్లదనము,వెచ్చదనము" కూడా ఉంది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ఈ గుణాలను లేదా లక్షణాలను భూమి మంచు మరియు సూర్యుని  స్నేహము వలన అదనంగా పొందినది కదా!
ఇలాగే వ్యక్తులు కూడా పొందుతారనీ దీనిని వ్యక్తులకు వర్తింప చేస్తూ, చక్కని పోలికతో రాసిన భాస్కర శతక కారుని  పద్యాన్ని చూద్దామా!. 
"అలఘుగుణ ప్రసిద్ధుడగునట్టి ఘనుండొక డిష్టుడైతనన్/వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా/తెలిసి కుచేలుడొక్క కొణి దెండటుకుల్ దనకిచ్చినన్ మహా/ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికీడె భాస్కరా!"
అనగా ప్రఖ్యాతి గాంచిన గుణవంతుడైన స్నేహితుడితో స్నేహం చేస్తే... ప్రేమతో తనకు కొంచెం  ఇచ్చినా,ఇవ్వక పోయినా తనకు నచ్చిన, మెచ్చిన వ్యక్తికి గొప్ప మేలును కలుగజేస్తాడు.కృష్ణుడు తన మిత్రుడు కుచేలుని అధిక సంపన్నుని చేయడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు."
అంటే భూమి లాంటి సుగుణం కలిగిన వ్యక్తి అంతకంటే మిక్కిలి గొప్పవాళ్ళను స్నేహితులుగా పొందినట్లయితే వారి యొక్క ప్రభావం వల్ల తనలో కూడా ఆ లక్షణాలు వచ్చి  చేరుతాయి అని అర్థం.
 మంచు వంటి శీతల స్నేహం వల్ల చల్లదనాన్ని ఇవ్వగలిగింది.సూర్యుని వంటి వెచ్చని స్నేహితుని వల్ల వెచ్చదనం, వెలుగును ఇవ్వగలిగింది.
 దీనిని బట్టి చేసే స్నేహాన్ని బట్టి దారానికి పూల సుగంధం అబ్బినట్లు,ఇనుము అయస్కాంతంతో స్నేహం చేస్తే అయస్కాంతంగా మారినట్లు ఆయా గుణాలు, స్థితి గతులు చేసే స్నేహం, వారి సాంగత్యం వల్ల మారుతాయని చెప్పేందుకు ఈ "భూ శైత్యౌష్ణ్య న్యాయము"ను చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం