సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -176
మండూక మక్షికా న్యాయము
******
మండూకము అంటే కప్ప, శాలూకము,మక్షికా అంటే ఈగ.
మండూక మక్షికా న్యాయము అంటే  కప్ప ఈగను తినబోవుట.మరి అందులో చెప్పుకోవాల్సింది ఏముందని మనకు అనిపించవచ్చు. కానీ ఈ కప్ప మామూలు స్థితిలో లేదు. తనే ప్రాణాపాయ స్థితిలో ఉంది.పాము నోటికి చిక్కింది.అయినా  అది ఈగను చంపబోతోంది.
కప్ప పాము నోటిలో వుండి కూడా ఈగను  చంపబోవడం అంటే తాను ఆపదలో ఉండి కూడా మరొకరికి ఆపద తలపెట్టే స్వభావం అన్న మాట.దీనినే మండూక మక్షికా న్యాయముతో పోల్చారు మన పెద్దలు.
 అంటే కొందరు వ్యక్తులు తామెంత ఆపదలో ఉన్నా  సరే.వారిలోని దుష్టాలోచన, దుష్టత్వం అస్సలు మారవు. ఏమాత్రం అవకాశం దొరికినా ఎదుటి వారికి హాని చేయాలనే దురాలోచన వారిలో ఎప్పుడూ ఉంటుంది.
 బాధాకరమైన పరిస్థితుల్లో  ఉన్న  అలాంటి వారిని చూసి మనసులో జాలి,దయ పుడుతుంది."అయ్యో! పాపం" అనిపిస్తుంది. కానీ వారి ప్రవర్తన గమనిస్తే ఛీ కొట్టాలని పిస్తుంది.
అందుకే అలాంటి దుష్టమైన బుద్ధి కలవారిని గురించి "పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోదు" అంటారు. కొందరు వ్యక్తులు ఇలాగే ఉంటారు.
తేలుకు కుట్టే బుద్ధి ఉంటుందని అందరికీ తెలుసు కదా!
ఓ రోజు తేలు నీటిలో కొట్టుకు పోతుంటే‌‌ ఓ వ్యక్తి చూసి దానిని రక్షించడానికి పట్టుకున్నాడట‌. తనకు ప్రాణ భిక్ష పెట్టిన ఆ వ్యక్తికి కృతజ్ఞత చెప్పాల్సింది పోయి అతడిని కుట్టిందట.అంటే నీళ్ళలో కొట్టుకొని పోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పటికీ దాని హీన గుణం మార్చుకోలేదు.
అందుకే వేమన దీనిని మనుషులకు వర్తింప చేస్తూ ఇలా అంటాడు...
"లెక్క లేని యాశ లీలమై యుండగా/తిక్క యెత్తి నరుడు తిరుగు గాక/ కుక్క వంటి మనసు కూర్చుండ నిచ్చునా/ విశ్వధాభిరామ వినురవేమ!"
దుర్మార్గుడిలోని దుష్టగుణాలు కుదురుగా ఒకచోట ఉండనీయవు.చచ్చిపోయే పరిస్థితిలోనూ ఆ గుణాలు బయట పడతాయి.
ఇలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొనే  కాబోలు.మన పెద్దలు తాము ప్రకృతిలోని జీవులను నిశితంగా చూసి మనుషులకు అన్వయం చేస్తూ వారి మనసులు ఎలా ఉండాలో? ఉండకూడదో ఇలాంటి న్యాయాల ద్వారా చెప్పారేమో అనిపిస్తుంది కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం