సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -154
బాణోష్ట్రీ న్యాయము
    *****
బాణము అంటే శరము,అమ్ము,అస్త్రం,అంబు అనే అర్థాలు ఉన్నాయి.ఉష్ట్రము అంటే ఒంటె. 
ఒక సారి కొండ చిలువ ఒంటెను పట్టి చంపే ప్రయత్నములో వుండగా అది చూచిన ఒంటె యొక్క యజమాని కొండ చిలువను బాణముతో  చంపి తన ఒంటెను రక్షించుకున్నాడు.అయితే ఇందులోని ధర్మధర్మాలు, పాప పుణ్యాల పరంగా చూస్తే ఆ యజమాని చేసిన పని ధర్మాధర్మాలు,పాప పుణ్యాల కతీతమైనదని చెప్పడమే ఈ" బాణోష్ట్రీ న్యాయము" యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎందుకంటే వానిలో రెండూ చంపదగనివే; రెండూ చావ దగినవే. కొండ చిలువ ఆహారం జంతువులు.దాని నోటి ముంగలి సిద్ధాన్నమును తీసి వేయుట పాపము.మరి అక్కడ కొండ చిలువ వలన  ఓ జంతువైన ఒంటె బలైపోతోంది. అలా దానిని రక్షించడం ధర్మమే కదా! అందుకే దాన్ని రక్షించడానికి  మానవుడు చేసిన పని పుణ్యమే అవుతుంది.
 
అయితే ఇక్కడ యజమాని ఇతర ఏ జంతువునైనా కొండ చిలువ చంపుతున్నట్లయితే దాన్ని రక్షించడానికి వెళ్ళే వాడు కాదేమో. అది చంపేది తన అధీనంలో ఉన్న జంతువు.దానిని రక్షించాల్సిన బాధ్యత తనదే కాబట్టి అతడు కొండ చిలువను చంపేసి ఒంటెను రక్షించుకున్నాడు.
ఇలా రెండు కోణాల్లోంచి చూసినా  ఒంటె యజమానికి పాపాపాపములు బాధించవు అనే అర్థం ఇందులో ఇమిడి ఉంది.
 శిబి చక్రవర్తికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పావురాన్ని డేగ నుండి రక్షించడానికి ప్రయత్నించిన శిబితో "శ్యేనాః కపోతాన్ ఖాదయంతి" అది నాకు సిద్ధాన్నము. వేద విహితమైన ఆహారము నా నోటి ముంగలి ఆహారాన్ని నీవు  రక్షిస్తానంటే ఎలా?" అంటుంది.
అప్పుడు శిబి " శరణు కోరి వచ్చిన పావురాన్ని చంపుతానంటే ఇవ్వడం  ధర్మం కాదు. " కావాలంటే పావురం కంటే బలమైన జంతువుల్ని వేటాడి ఇస్తాను" అంటాడు.
ఇలాంటిదే మరో కథ కూడా ఉంది.
ఓ దొంగను రాజ భటులు వెంటాడుతూ ఉండగా పరుగెత్తుకుంటూ వెళ్ళి తపస్సు చేస్తున్న ముని ఆశ్రమంలో తలదాచుకుంటాడు.రాజ భటులు వచ్చి దొంగ గురించి మునిని  అడుగుతారు.అప్పుడు ఆ ముని ధర్మం తప్పకుండా, పాపం బాధించకుండా యుక్తిగా ఇలా అంటాడు.
"కళ్ళు చూశాయి కానీ చెప్పలేవు, నోరు చెప్పగలదు కానీ చూడలేదు కాబట్టి మీరే అర్థం చేసుకోండి"అని వాళ్ళు అడిగిన దానికి జవాబు అలా చెబుతాడు . ధర్మాధర్మాలకు అతీతంగా మాట్లాడిన ముని మాటలకు ఏమీ చేసేది లేక ఆ భటులు అక్కడ నుండి వెళ్ళి పోతారు.
ఇలాంటి సందర్భాలు, సంఘటనలు ఎదురైనప్పుడు మనసున్న మనిషిగా పాప పుణ్యాల కతీతంగా  చేయాల్సిన ధర్మం గురించి చెప్పడానికి,ధర్మ సంకట పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో       ఈ "బాణోష్ట్రీ న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం