సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -172
భ్రమర న్యాయము
******
భ్రమరము అంటే తుమ్మెద, తేనెటీగ ముంగురులు,అభినయ హస్త విశేషము.
తేనెటీగ పూవులకు అంటి వున్న ముండ్లను వదిలి దానిలోని మకరందాన్ని మాత్రమే తాగుతుంది.
అలాగే అది మకరందం, సువాసన లేని పూల వద్దకు పోదు.
మరొక విశేషం ఏమిటంటే తేనెటీగకు ముల్లు ఉంటుంది.అది మకరందం సేకరించే వేళ మృదువుగా ఉన్న పూవుకు ఎలాంటి హానీ కలుగజేయదు.
ఇలా  బుద్ధిమంతుడు, గుణవంతుడు ,మానవీయ విలువలు కలిగిన వ్యక్తి కూడా తేనెటీగ లాంటి వాడనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
తేనెటీగ ముండ్లతో ఉన్న పూవుల నుంచి ఎంతో ఒడుపుగా ముళ్ళు గుచ్చుకోకుండా వాటిలోని తేనెను మాత్రమే గ్రహిస్తుంది.
అలాగే బుద్దిమంతుడైన వ్యక్తి ఎదుటి వారి లోని దుర్గుణాలను వదిలేసి వారిలోని సుగుణాలను మాత్రమే స్వీకరిస్తాడు.
తేనెటీగ సువాసన , మకరందం ఉన్న పూవుల వద్దకే వెళుతుంది కానీ వాసన, మకరందం లేని పూల వద్దకు వెళ్ళదు.
అలాగే గుణవంతుడైన వ్యక్తి సజ్జనుల సాంగత్యమే చేస్తాడు కానీ గుణ హీనులు, అప్రయోజకులైన వారి చెంతకు చేరడు. వారికి దూరంగా ఉంటాడు.
తేనెటీగకు స్వీయ రక్షణ కోసం ముల్లు అనే అవయవం ఉంటుంది కదా!.అది దానితో కుడితే తేలు కుట్టినంత బాధ కలుగుతుంది.దద్దుర్లు కూడా వస్తాయి.ఆ మొనదేలిన ముల్లుకు కర్రకు సైతం రంధ్రం చేయగలంత బలం ఉంది.
అంతటి శక్తి గల  ముల్లు ఉన్నా తేనెటీగ సుకుమారమైన పూవుకు తన ముల్లుతో ఎలాంటి హానీ చేయదు.
అలాగే మానవీయ విలువలు కలిగిన వ్యక్తి  బలం,శక్తి సామర్థ్యాలు,ప్రతిభ లాంటివి ఉన్నా మాటలతో గానీ, చేతలతో గానీ ఇతరులెవరికీ ఎలాంటి కష్టం, నష్టం కలగకుండా చాలా మృదువుగా ప్రవర్తిస్తాడు. 
ఈ విధంగా మనిషి వ్యక్తిత్వం  భ్రమరంలా ఉండాలనే ఉద్దేశ్యంతో దీనిని నిశితంగా పరిశీలించిన  మన పెద్ద వాళ్ళు ఈ "భ్రమర న్యాయము " గురించి వ్యక్తులకు వర్తింప చేసి చెప్పారు.
 ఈ న్యాయమును సదా గమనంలో ఉంచుకొని మంచికి మారు పేరుగా జీవిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం