పఠనం మొక్క నాటండి!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
పఠనం ఒక్కటే ఎప్పుడైనా ఎక్కడైనా చేసేది.

భారతీయ భాష దేశ పటంలో చోటిస్తే
ఆంగ్ల భాష ప్రపంచ పటంలో చోటిస్తుంది.

పఠనం మొక్కటే 
ఏ భాష కైనా పాఠం చెబుతుంది
ప్రపంచానికి గుణపాఠం చెప్తుంది!!!

పఠనం మొక్క నాటితే
ప్రపంచానికి ఫలాలను ఇస్తుంది
ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితాలనిస్తుంది!!

వీడియోలు ఆడియోలు వాడుకుంటే
సమయం ఆదా అవుతుంది
సమాచారం సంజీప్తంగా నిక్షిప్తం అవుతుంది.
సౌకర్యంగా ఉంటుంది. కానీ

పఠించడం వల్ల
సమయాన్ని సరిగ్గా వినియోగిస్తాం.
మానసిక శక్తి రెట్టింపు అవుతుంది

మానసిక తృప్తి సంతృప్తిమిగురుతుంది.
మనశ్శాంతి కలుగుతుంది.

ఎక్కువ మాట్లాడాలన్నా
మాట్లాడకుండా ఉండాలన్న
పఠనమే సరియైనది.!!!!....!

జ్ఞానానికి జ్ఞాపకశక్తికి
ముఖ్యఅతిథి పఠనం!!!!

ఏదైనా మళ్లీ మళ్లీ చదవడం వల్ల
కంఠస్థం చేయొచ్చు జ్ఞాపకం పెట్టుకోవచ్చు!!
కానీ
మళ్లీ మళ్లీ చూడటం వల్ల
మళ్లీ మళ్లీ వినటం వల్ల
మార్పు మామూలు అవుతుంది.!
మరుపు మామూలు అవుతుంది.!!
మతిమరుపు మొదలవుతుంది.!!!?

ప్రతిభావంతులంతా పఠిస్తారు
పఠనం వల్ల ప్రతిభావంతులవుతారు!!

పఠనం మొక్క నాటండి
ప్రతి ఒక్కరూ
పఠనానికి చేతులెత్తి మొక్కండీ....!!!

పాఠశాల విద్యాశాఖ పఠనోత్సవాలను పురస్కరించుకొని.
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు
తల్లీ నమస్తే పఠనావశ్యకతను చక్కగా వివరించారు. ఈ అలవాటు లేమిచేత నేటి విద్యార్థి లోకం మానసిక ఒత్తిడి వంటి జాఢ్యం నుండి బయట పడలేక నరకం అనుభవిస్తుంది. మంచి రచననందించారు. ధన్యవాదములు.

నాకు అర్థం కాని పాదాలు....రెండున్నాయి. అవి...

పఠనం మొక్కటే
సమాచారం సంజీప్తంగా



మౌళిపాలక
జయపురం
ఒడిశా
28062023


తల్లీ నమస్తే పఠనావశ్యకతను చక్కగా వివరించారు. ఈ అలవాటు లేమిచేత నేటి విద్యార్థి లోకం మానసిక ఒత్తిడి వంటి జాఢ్యం నుండి బయట పడలేక నరకం అనుభవిస్తుంది. మంచి రచననందించారు. ధన్యవాదములు.

నాకు అర్థం కాని పాదాలు....రెండున్నాయి. అవి...

పఠనం మొక్కటే
సమాచారం సంజీప్తంగా



మౌళిపాలక
జయపురం
ఒడిశా
28062023


Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం