మానవత్వం పరిమళించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది;- సి హెచ్. సాయిప్రతాప్
 సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదని, మానవత్వం లేని మతం రాణించదు అని శాస్త్రాలు బోధిస్తున్నాయి.. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు స్వర్గం లభించదు.

మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింస మానవ ప్రేమే మానవ ఆదర్శం అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి జీవితంలో ఆచరించడం. ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న అన్న ప్రాతిపదికన వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి.
అయితే ఈ అపురూపమైన విలువలకు పాతరేసి కొందరు జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురు తీసి ఊరేగుతున్నాయి. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే.. స్ర్తి ఒంటరిగా కనిపిస్తే చాలు, కసిదీరా కాటేస్తున్నాయి. ఎన్నడూ మహిళలను చూడనట్లు ఆబగా చూసే కళ్ళు.. అనె్నం పునె్నం ఎరుగని చిన్నారులు, మహిళలపై దాడి చేసి దాహం తీర్చుకుంటున్నాయి. మానవత్వం క్రమ క్రమంగా మంట కలిసిపోతోందనడానికి ఇటివలి సంఘటనలు ఒక ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
మీలో మానవత్వం చచ్చిపోయుంటే, మీకు ఎన్నో నీతిబోధలు అవసరమౌతాయి. మీలో మానవత్వం సజీవంగా, పొంగి పొర్లుతుంటే, మీరు సహజంగానే మీకూ, మీ చుట్టూ ఉన్నవారికందరికీ ఉత్తమమైనదే చేస్తారు అని సద్గురు జగ్గీవాదుదేవ్ అత్యద్భుతంగా చెప్పారు.


దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు.  దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి వారి గుండెల్లో ఉండే మానవత్వం. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది.. మానవత్వం చేతలలో ఆచరిస్తే మనసు నిర్మలం అయ్యి తద్వారా భగవత్ కటాక్షం తప్పక కలుగుతుంది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం