సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -156
భర్చు న్యాయము
  ****
భర్చు లేదా భర్చుడు అనేది ఒక వ్యక్తి పేరు.
ఇలా వ్యక్తి పేరుతో కూడా మన పూర్వీకులు ఓ న్యాయాన్ని  సృష్టించడం విశేషం.
పదిమంది మాటలు ఎంత నమ్మశక్యంగా ఉంటాయో,..మరి భర్చుడు బతికుండగానే పిశాచంగా ఎలా పిలవబడ్డాడో  ఆ కథేంటో చూద్దామా..!
అనగనగా ఒక రాజుకు భర్చుడు అనే మంత్రి ఉండే వాడట.అతడు రాజు ఆదేశాల మేరకు శత్రువును జయించడానికి ఇతర దేశం వెళ్ళాడు.అక్కడ శత్రువును ఓడించాడు.రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.పరిస్థితులు చక్కబడేంత వరకు  కొన్ని సంవత్సరాల పాటు ఆ రాజ్యంలోనే ఉండవలసి వచ్చింది.
ఇప్పటిలా చరవాణి సౌకర్యాలు లేకపోవడంతో   భర్చుడు అంటే పడని విరోధులకు మంచి అవకాశం లభించింది.రాజు గారు భర్చుని గురించి విచారించే సమయంలో విరోధులు రాజుతో  "ఇంకెక్కడి భర్చుడు ఎవరో శత్రువులు అతణ్ణి చంపేశార" ని చెప్పారు. దాంతో రాజు భర్చుని స్థానంలో మరో మంత్రిని నియమించుకున్నాడు.
కొంత కాలం తర్వాత భర్చుడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాజు గారి ఆస్థానంలో తన బదులు వేరే వ్యక్తి మంత్రిగా నియమింపబడినాడని తెలుసుకుని చాలా బాధ పడ్డాడు. వైరాగ్యంతో సన్యాసం పుచ్చుకుని అడవిలోకి వెళ్ళి పోయాడు.
అలా కాలం గడుస్తుండగా ఒక రోజు రాజు వేటకని తన భటులతో అడవికి వెళ్ళాడు.
వారిలో కొందరు సన్యాసి వేషంలో ఉన్న భర్చుని చూసి బెదిరిపోయారు. పరుగెత్తుకుంటూ వచ్చి "రాజా! అదిగో భర్చుడి పిశాచము" అని గట్టిగా కేకలు వేశారు.
భర్చుడు చనిపోయాడని అంతకు ముందే రాజు గారు  విని ఉండటం వల్లనూ, భర్చుడు గడ్డాలు మీసాలతో సన్యాసి వేషంలో ఉండటం వల్లనూ  భర్చుడు నిజంగా పిశాచమయ్యాడని అనుకున్నాడు. 
అంటే పది మంది ఏదైతే చెబుతారో అదే నిజమని నమ్ముతారు. దీనికే ఓ తెలుగు సామెత ఉంది " నలుగురు నంది అంటే నంది" "పంది అంటే పంది" అన్నమాట.
దీనికి సంబంధించిన వేమన పద్యం చూద్దాం.
"పదుగురాడు మాట పాటియై ధర జెల్లు/ ఒక్కడాడు మాట ఎక్కదెందు/ఊరకుండు వాని నూరెల్ల నోపదు/ విశ్వధాభిరామ వినురవేమ "
పదిమంది మాట్లాడిన మాట ఏదైనా చెల్లుతుంది అంటే అబద్దం కూడా నిజంగా మారుతుందనీ.ఒక్కడు నిజం చెబితే చెల్లుబాటు కాదు.ఎవరూ దానిని నిజమని నమ్మడానికి ఇష్టపడరనీ."అనే అర్థంతో ఈ  న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఇదండీ "భర్చు న్యాయము" యొక్క కథా కమామీషు. ప్రస్తుతం లోకం తీరు కూడా ఇలాగే నడుస్తుంది కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం