కష్టేఫలి;- బల్ల కృష్ణవేణి-పలాస -శ్రీకాకుళం జిల్లా

 అనగనగా సిరిపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో బడి,గుడి తోటలు, పంట పొలాలు ఉన్నాయి. ఆ ఊరు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ బడిలో రామం అనే ఉపాధ్యాయుడు ఉన్నారు. అతనికి సీత అనే భార్య లవ,కుశ అనే పేర్లు గల ఇద్దరూ అబ్బాయిలు ఉన్నారు. లవ 9 వ తరగతి, కుశ 10 వ తరగతి చదువుతున్నారు. ఆ పిల్లలకి భార్య భర్తలు ఇద్దరూ రోజు తోట కి తీసుకు వెళ్లేవారు. ఆ తోటలో పక్షులు కిలకిల రావాలు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ తోటలో రామచిలుకలు అటు ఇటు ఎగురుతూ ఉంటే మనసుకి ఆనందంగా ఉంటుంది. లవ అనే వాడు బాగా చదివేవాడు. కుశ కి చదువు అంటే బద్ధకం ఆ కారణంగా 10వ తరగతి ఉత్తీర్ణుడు అవ్వలేదు. వీడికి బద్ధకం పోవాలంటే ఒక గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు ఉపాధ్యాయుడైన తండ్రి. వీళ్లు రోజు తోటకి వెళ్తుంటారు. ఒక రోజు తోట నుండి ఒక రామచిలుకను ఇంటికి తెచ్చారు. దానికి ఒక పంజరం ఏర్పాటు చేసి, దానికి గింజలు, పళ్ళు అన్ని ఆహారంగా పెడుతున్నారు. ఆ చిలుక కి చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ చిలుకకి ఇక్కడ బాగా నచ్చింది ఎందుకంటే కావలసినంత తిండి దొరుకుతుంది. అదే తోటలో అయితే తిండి కోసం వెతుక్కోవాలి. ఇక్కడే బాగుంది అనుకుంది. ఎగరడం మానేసి అటు ఇటు తిరగడం మానేసింది. ఆ చిలుకకి అలా బద్ధకం చాలా ఎక్కువ అయింది. దాని పంజరం తలుపులు తీసిన ఎగరడం మానేసింది. అప్పుడు రామం ఆ చిలుకకు రెండు రోజులు ఆహారం పెట్టలేదు. దానికి ఆకలిగా ఉండీ, అటు గా రామచిలుకలు గుంపులు ఎగరడం చూసింది. ఒక్కసారిగా బద్ధకం వీడి పంజరం నుండి ఆహారం కోసం ఎగిరిపోయింది.ఉపాధ్యాయుడు తన అబ్బాయి అయినా కుశ కి ఈ చిలుక ఉదాహరణ గా బోధించాడు. అప్పటినుంచి కుశ మంచిగా చదువుకుని 10వ తరగతి ఉత్తీర్ణుడు అయ్యాడు.
 కథ సారాంశం: ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది.

*****

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం