నాడు ఆచార వ్యవహారాలు, అణుకువ, ప్రేమాభిమానాలు, పెద్దలంటే గౌరవం, స్త్రీ లంటే మర్యాద, అణకువ తో కూడిన సాoపప్రదాయము
కలిగిన తెలంగాణా ప్రజలంటే
ఇతర రాష్ట్రాల వారికీ చేతకాని తనం అనిపిస్తే,
తెలంగాణా బాషా యాస అని హేళన చేసిన బాష ఇప్పుడు రాజబాష అయిoది.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ విషయం లో తెలంగాణకు అన్యాయం జరిగి నీళ్లు అందక తెలంగాణా భూములు బీడు భూములయి కంపలు, చెట్లకు నిలయమైంది
పంటలు లేక వందల ఎకరాలు ఉన్నా ఇంట్లో పస్తులే.
బయట కూలి చేయలేక, ఇంట్లో ఉండలేక సంపాదనా మార్గం లేక
ఎన్నికుటుంబాలో నరకం చూసాయి.
కుటుంబ ప్రేమలు, బాధ్యతలు కలిగిన తెలంగాణా ప్రజలు కేవలం బ్రతుకు తెరువుకు దురాబారం వెళ్లే పరిస్థితి లేదు.
అది బయటి వారికీ తెలంగాణా ప్రజలంటే బద్ధకస్తులు పనిచేత కాదు అనే పేరు పడిపోయింది
నేడు
తెలంగాణా వచ్చాక తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంస్కరణలు,
నీటి పారుదల, చెరువుల
త్రవ్వకాలతో జలమయం అయి బీడు భూములు కాస్త పచ్చని సస్య శ్యామలంతో నిండిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ రాకతో పొలాలన్ని కళకళ లాడిపోతున్నాయి
రైతన్న చేతినిండా పని దొరుకుతుంది.
24 గంటల కరెంటు రావడంతో గ్రామాలన్నీ అంధకారం వీడి కాంతులు వెదజల్లుతున్నాయి.
కర్శకులు ఎప్పుడు వస్తుందో తెలీని కరెంట్ కొరకు తెల్లవార్లు నిద్రలేకుండా పొలాల గట్ల కాపలా వుండి పాముకాట్లు, చీకటిలో కరెంట్ షాక్ల వల్లవచ్చేమరణాలు తగ్గుముఖం పట్టాయి.
కల్యాణ లక్ష్మి పథకంతో ఎంతో మందికి కెసిఆర్ మేనమామాల అండగా నిలిచి బేడా ఆడ పిల్లల పెళ్లిళ్లు అయ్యేలా చేస్తున్నాడు.
అమ్మవడి పథకం ప్రవేశ పెట్టి
ప్రభుత్వ వాహనములో తీసుకెళ్లి తల్లికి ఆరోగ్యవసతులు, బిడ్డకు కిట్టు,
అమ్మమ్మకు చీరే కూడా పెట్టి పంపిస్తు తల్లిగారిల్లు మరిపిస్తున్నది తెలంగాణాప్ర భుత్వం.
వితంతులకు ,, భర్త వదిలేసిన స్త్రీ లకు నెల నెలా పెన్షన్ ఇస్తూ అన్నలా అండగా ఉంటున్నాడు
వికలాంగులకు అధిక మొత్తం పెన్షన్ అందిస్తూ ఆపద్బాంద వుడిలా కాపాడుతున్నాడు.
రేషన్ కార్డు ల మీద నిత్యావసరాలు అందిస్తూ ఎన్నో కుటుంబాలకు ఆకలిని తీరుస్తుంది తెలంగాణా ప్రభుత్వం.
ఐటీ హబ్ ఒక సంచలనమే
ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిపించి
ఇంటికొక సాఫ్ట్వె్ర్ అవడంతో
కుటుంబాలన్నీ ఆర్థిక బాధలేకుండా ఆడంబరంగా జీవిస్తున్నాయి.
60 సంవత్సరాములు దాటిన వృద్దులకు తక్కువ రేటుతో ప్రయాణ సౌకర్యాలు,
ఆరోగ్య వసతులు, పెన్షన్లు ఇస్తూ మరీ బిడ్డలా చూసుకుంటుంది తెలంగాణా ప్రభుత్వం.
చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పునరనిర్మాణం చేపట్టి పూర్వ వైభవన్నీ తెచ్చింది
అసెంబ్లీ, సెక్రటేరియట్, అమరుల స్తూపం ఆధునిక పునరనిర్మాణం చేపట్టి తెలంగాణా మీద తనకున్న అభిమానం చాటుకున్నది తెలంగాణా ప్రభుత్వం.
జై తెలంగాణా, జై జై తెలంగాణా
నాడు - నేడు;-తెలంగాణా;- DR. అరుణకోదాటి- హైదరాబాద్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి