తొలితరం దేశభక్తిగాయనిగా మాదీ స్వతంత్ర మాది స్వతంత్రజాతి ఎలుగెత్తిన ఈకీర్తిశిఖరం టంగుటూరి శ్రీరాములు రాజేశ్వరి గార్రకు 1925నవంబర్ 13 న రాజమండ్రిలో జన్మించారు. టంగుటూరి ప్రకాశంపంతులు గారి తమ్ముని కుమార్తె ఈమె.బాలకోకిలగా పేరుపొందినఈమె తరువాతకాలంలో క్రేంబ్రిడ్జిసీనియర్ మెట్రిక్యులేషన్ పరిక్షలోఉత్తిర్ణత సాధించారు.ప్రముఖ సంగీత విద్వాంసులు అరియకూడి రామానుజ అయ్యంగార్ వద్దసంగీతం అభ్యసించారు.1937 లో తన పదమూడవఏట "విప్రనారాయణ"(తమిళం) చిత్రంద్వారా సినిమా రంగానికి పరిచయం చేయబడ్డారు.1944 లో "గీతాప్రకాష్ "అనే సంస్ధ స్ధాపించి ,పలుప్రాంతాలలో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన ధనాన్ని క్షయ వ్యాధి వైద్యశాలకు,రెడ్ క్రాస్ సంస్ఢకు విరాళంగా అందజేసారు. 1952 లో ఈమె "మిస్ మద్రాసు"గా ఎంపిక అయ్యరు. అమెరికా చలనచిత్ర పర్యటనకు 14 భారతీయులులను ఎంపిక చేయగా అందు లో ఈమె ఉన్నారు.1953 అక్టోబర్ 1 న ఆంధ్రరాష్ట్ర అవతరణ సభలో నెహ్రు,రాజాజి,ప్రకాశం గారి సమక్షంలో 'వందేమాతరం' గీతంతోపాటు 'మాతెలుగు తల్లికి మల్లేపూదండ'గీతాన్ని తొలి సారి ఆలపించారు.అలా ఎన్నో లలిత గీతాలు గ్రాంఫోన్ రికార్టులుగా
వెలువడ్డాయి.మెత్తం26తెలుగు,తమిళం,హిందీ,గుజరాతి,సంస్కృతం,
ఇంగ్లీషు చిత్రాలలో నటించారు.1956 లో ఈమె నిర్మించిన'చిత్రార్జున' చిత్ర ప్రదర్మన చూసిన నెహ్రు,సర్వేపల్లిరాధాకృష్ణా గార్ల అభినందనలు పొందారు.1960 లో లండన్ వెళ్ళి అక్కడ 'ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ 'అనే సంస్ధస్ధాపించి భారతీయ పలుకళలు ప్రదర్మించి పేరుపొందారు. 1968 లో గాంధీ శతజయంతి ఉత్సవాలకు నివాళులు అర్పిస్తూ సెయింట్ పాల్ కెథడ్రల్ ల్లో గానం చేసిన తొలి భారతీయమహిళగా గుర్తింపుపొందారు.నార్వే,స్వీడన్ ,స్పెయిన్ ,కెనడా,అమెరికా వంటి దేశాలలో సంగీతశిక్షణాలయాలు స్ధాపంచి వందలమంది కళాకారులకు శిక్షణ యిచ్చారు.అమెరికా బ్రాడ్ వే ధియోటర్లొ విశ్వకవి రవీంద్రుని
'కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్ 'నాటకంలో రాణి పాత్ర ధరిచి బ్రడ్వే అవర్డు పొందిన తొలి భారతీయు రాలుగా గుర్తింపు పొందారు.అమెరికా ప్రభుత్వం కొలంబియా విశ్వవిధ్యాలయంలో బోధకురా లుగానియ మించింది.1961 లోఅమెరికా లో' OBPE'అవార్డు అందుకున్నారు.లండన్ ల్ స్థిరపడి అక్కడి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారుడు'హెరాల్డ్ ఎల్విన్ ' గారిని వివాహంచేసుకున్నారు.ప్రాచ్య,పాశ్యాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్బావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినిపొందిన ఈమె 1985 లో తనజీవిత భాగస్వామిని కోల్పోయారు.తనశేషజీవితాన్ని జీవితాన్ని వ్యాధి గ్రస్తుల సేవలో గడిపిన మన ఈతెలుగు కీర్తి శిఖరం 2005ఏప్రిల్ 24 న కళామతల్లి వీణావాణి పాదసేవకై అంబరర వీధిన పయనించారు.
టంగుటూరి సూర్యకుమారి.; డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి