మా గ్రామంలో పురాతనమైనది చిదానంద ఆశ్రమం దానిని గాయత్రి మందిరం అని పిలుస్తారు గాయత్రి అమ్మవారి విగ్రహాన్ని 1929 వ సంవత్సరంలో తేలప్రోలు పార్సిన్స్ పేటలో ఏలూరు కాలువ పక్క విజయవాడ ఏలూరు కాలువ 30 కిలోమీటర్ల దగ్గర ప్రతిష్టించారు ఈ గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరాలను ఉచ్చరణ చేసిన వారిని వేదమాత గాయత్రి దేవి రక్షిస్తుంది వాల్మీకి మహాముని రామాయణంలో ఒక్కొక్క అక్షరానికి వేయి శ్లోకాలు చొప్పున 24 వేల శ్లోకాలను రచించిన విషయం అందరికీ తెలిసినదే ఆ 24 ధర్మాలను పాటించిన వాడు కనుక శ్రీరామచంద్రమూర్తి నేటికీ ఆరాధ్య దైవంగా నిలిచి ఉన్నాడు అలాంటి గాయత్రి అమ్మవారు మా గ్రామంలో ఉన్నారు. గుడిపాటి సుబ్బరాయ సోమయాజి యజ్ఞము చేసినవాడు వారి సోదరులు గుడిపాటి లక్ష్మీనారాయణ నరసింహం గారు కలిసి గాయత్రి గుడిని కట్టించారు వీరిద్దరూ తర్వాత సన్యాసం స్వీకరించారు గాయత్రి కి కుడి భాగమున ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఎడమ ప్రక్క సచ్చిదానంద స్వాముల వారి విగ్రహాన్ని అమర్చారు 1992 సంవత్సరంలో నవ కుండీలతో హోమ గుండములు 1994లో గాయత్రీ పరిపార ఆంధ్ర శాఖ గుంటూరు వారి ఆధ్వర్యంలో 24 కుండీలతో హోమగుండ్లములు యజ్ఞము జరుపబడ్డాయి అక్కడ కాలవ స్థానానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే తమ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గుడిపాటి నారాయణ శర్మ గారు మా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల పాఠాలను చెప్పడంలో పేరుపొందిన వాడు చాలా సున్నితమైన స్వభావం ఏనాడు ఎవరిని ఒక్క మాట కూడా అనేవాడు కాదు వారంటే అందరికీ గౌరవం భక్తి వారి అబ్బాయి కృష్ణ చిన్నతనంలోనే ఆధ్యాత్మిక చింతనలో ఉండి తన చదువు పూర్తయిన తర్వాత తనకు తెలిసిన జ్ఞానంతో జాతకాలు చెప్పడం పాం హిస్టరీలో కూడా పేరు తెచ్చుకున్నాడు శిష్యులకు శిక్షణ ఇస్తూ ప్రతిరోజు అమ్మవారికి నిత్య నైమిత్తిక కార్యక్రమాలను జరుపుతూ ఎలాంటి లోపము లేకుండా వైదిక కర్మలన్నీ చేస్తూ ఉంటాడు ఆ వయసులో అంత శ్రద్ధగా చేస్తూ ఉండడం మా అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం మా గ్రామ పేరంటాలమ్మ తర్వాత గాయత్రి అమ్మవారిని గ్రామస్తులు పూజిస్తారు
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి