న్నం పరబ్రహ్మ స్వరూపం” కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను అని మన భారతీయ సనాతన సంప్రదాయం స్పష్టంగా చెబుతోంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, మనం ఏమి తినాలి మరియు ఎంత తినాలి అనే విషయమే కాకుండా, తినే ఆహారం అంతా సరిగా జీర్ణమవుతుందా లేదా అనేది గమనించాలి.
మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసే బాధ్యత మన లోపలి జఠరాగ్ని పై ఆధారపడి ఉంటుంది. ఈ జఠరాగ్ని, అనగా జీర్ణక్రియ ఆకాశంలో సూర్యుని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు ఉంటే, ఆ సమయంలో మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
కొందరిలో ఎప్పుడూ తింటూ వుండే అలవాటు వుంటుంది. పరిపుష్టి గల శరీరం , ఆరోగ్యం కోసం బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం మంచిదే అయితే ముందు తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవడం స్పష్టమైన సాధారణ నియమం. ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే, ఆయుర్వేదంలో సూచించిన విధంగా భోజన సమయాన్ని అనుసరించాలి.
ఆయుర్వేదం ప్రకారం, భోజనం చేయడానికి అనువైన సమయం ఉదయం 9 నుండి 10 వరకు మరియు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు (అనగా సూర్యాస్తమయానికి ముందు). పూర్వ కాలంలో ప్రజలు ఈ భోజన సమయాలను ఖచ్చితంగా పాటించేవారు కాబట్టి, వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేవారు. సాధన చేయగలిగేలా దేవుడు ఈ శరీరాన్ని మనకు బహుమతిగా ఇచ్చాడు. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఈ శరీరంతో ఎక్కువ సాధన చేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఆహారం తినడానికి సమయ పట్టికను అనుసరించాలి.
చాలామంది తినే ఆహారం విషయంలో సమయం సందర్భాలు పాటించరు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరిగ్గా నిద్ర పోవాలని, లేదంటే ఎసిడిటీ హృద్రోగ సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసే బాధ్యత మన లోపలి జఠరాగ్ని పై ఆధారపడి ఉంటుంది. ఈ జఠరాగ్ని, అనగా జీర్ణక్రియ ఆకాశంలో సూర్యుని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు ఉంటే, ఆ సమయంలో మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
కొందరిలో ఎప్పుడూ తింటూ వుండే అలవాటు వుంటుంది. పరిపుష్టి గల శరీరం , ఆరోగ్యం కోసం బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం మంచిదే అయితే ముందు తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవడం స్పష్టమైన సాధారణ నియమం. ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే, ఆయుర్వేదంలో సూచించిన విధంగా భోజన సమయాన్ని అనుసరించాలి.
ఆయుర్వేదం ప్రకారం, భోజనం చేయడానికి అనువైన సమయం ఉదయం 9 నుండి 10 వరకు మరియు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు (అనగా సూర్యాస్తమయానికి ముందు). పూర్వ కాలంలో ప్రజలు ఈ భోజన సమయాలను ఖచ్చితంగా పాటించేవారు కాబట్టి, వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేవారు. సాధన చేయగలిగేలా దేవుడు ఈ శరీరాన్ని మనకు బహుమతిగా ఇచ్చాడు. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఈ శరీరంతో ఎక్కువ సాధన చేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఆహారం తినడానికి సమయ పట్టికను అనుసరించాలి.
చాలామంది తినే ఆహారం విషయంలో సమయం సందర్భాలు పాటించరు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరిగ్గా నిద్ర పోవాలని, లేదంటే ఎసిడిటీ హృద్రోగ సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి