మలక్ పేట , బ్రహ్మానందనగర్ లో ప్రోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్వగృహంలోఆదివారం ఆగస్టు 27వ తారీఖున 11 గంటలకు ఆవిడ పుస్తకం "అనుభవాలు-జ్ఞాపకాలు" పుస్తకం ఆవిష్కరణ జరిగింది.సెంటర్ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్ సర్రాజు గారు ఎంతో అంతరార్ధం ఉన్న నవల ఇది అని,ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయని అన్నారు.తెలుగు డిపార్ట్మెంట్ ఆరుణ గారు కూడా అనుభవాలు జ్ఞాపకాలు గురించి ఈ తరం వారు చదవాల్సిన పుస్తకం అన్నారు.రచయిత్రి యలమర్తి అనూరాధ ఎన్నో తరాల సంగతులు
వీరి సాహిత్యం వలన తెలుసుకోగలుతున్నామని,వారి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని అన్నారు. ప్రోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ఈ పుస్తకం రావడానికి ముఖ్య కారకులు బొంబాయి లో ఉన్న ఇందిరా రాజ్ గోపాల్ గారని ,తాను ఫోన్లో చెబుతూ ఉంటే ఆవిడ రాయటం వల్లనే ఈ నా పుస్తకం వెలువడిందని ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేశారు.శీలా సుభద్ర,
ప్రోలాప్రగడ సత్యనారాయణ గారు, రాజ్యలక్ష్మి గారి రెండవ కుమారుడు ప్రోలాప్రగడ రాజశేఖర్.ప్రోలాప్రగడ జనార్దన్ రావు, డాక్టర్. సంగీతరావు,వెంపటి కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
యలమర్తి అనూరాధ
హైద్రాబాద్
చరవాణి:924726౦206
వీరి సాహిత్యం వలన తెలుసుకోగలుతున్నామని,వారి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని అన్నారు. ప్రోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ఈ పుస్తకం రావడానికి ముఖ్య కారకులు బొంబాయి లో ఉన్న ఇందిరా రాజ్ గోపాల్ గారని ,తాను ఫోన్లో చెబుతూ ఉంటే ఆవిడ రాయటం వల్లనే ఈ నా పుస్తకం వెలువడిందని ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేశారు.శీలా సుభద్ర,
ప్రోలాప్రగడ సత్యనారాయణ గారు, రాజ్యలక్ష్మి గారి రెండవ కుమారుడు ప్రోలాప్రగడ రాజశేఖర్.ప్రోలాప్రగడ జనార్దన్ రావు, డాక్టర్. సంగీతరావు,వెంపటి కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
యలమర్తి అనూరాధ
హైద్రాబాద్
చరవాణి:924726౦206
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి