121.మేఘం చూడు, కూడబెట్టిన, నీరు వర్షించి తరిస్తోంది!వనం పిలిచి, పూలనవ్వుల, పలకరించి పరవశిస్తోంది!అంతరంగం విను, ప్రేమగా, ఎంతగానో మందలిస్తోంది!మానవత్వం నిలబెట్టమని, లాలిస్తూ, ప్రబోధిస్తోంది !కాలం సాగిపోతూ ,ఒక, అడుగు, ఆగి ఆశీర్వదిస్తోంది!122.ప్రపంచాన అసురులే కాదు, సురులూ ఉన్నారు!భారతాన కౌరవులతోపాటు, పాండవులూ ఉన్నారు !ఇక్కడ గంజాయి వనాలేనా, తులసి మొక్కలూ ఉన్నాయి!లెక్క తక్కువైనా, నిక్కచ్చి , మానవులూ ఉన్నారు!దురాత్ములెందరున్నా ,ఒక మహాత్ముడూ ఉన్నాడు!123.తులసీదాస్ ,కబీర్ దాస్ ,సూరదాస్!తుకారాం, శిరిడి సాయి, మీరాబాయి !ఇలా ఎందరో కారణజన్ములు,అవతరించిన ఘనులు!దైవ ప్రతినిధులు,నిజ జ్ఞాననిధులు!వారి బోధనలు పూర్తిగా విను ,చూపిన జాడ వీడక నడు!_________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా పివిఎల్ సుబ్బారావు 94410 58797.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి