రేపు బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్ పుస్తకావిష్కరణ..

 ఉట్నూర్:- సోనాపూర్ నార్నూర్ మండల ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులైన ప్రభుత్వ అధ్యాపకులు, రచయిత రాథోడ్ శ్రావణ్ * గారు రచించిన  మాజీ మంత్రి,అఖిల భారతీయ బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు  దేశవ్యాప్త బంజారాల యోధుడు *అమర్ సింగ్ తిలావత్ గారి జీవిత చరిత్ర బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్  పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ యందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గల దూర విద్యా కేంద్రం భవనంలో రేపు అనగా తేది: 14/10/2023 శనివారం రోజున ఉ,9:30 గం,లకు బంజారా రచయితల వేదిక ఆదిలాబాద్ మరియు అఖిల భారతీయ ధర్మ రచన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలకు ప్రాతినిత్యం వహిస్తున్న ఎంతోమంది గొప్ప గొప్ప మేధావుల చేతుల మీదుగా ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగబోతున్నది. కావున బంజారా సమాజంలోని యువకులు, మేధావులు, రచయితలు, కవులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇవ్వడం జరుగుతుంది.
కామెంట్‌లు