న్యాయాలు -276
శాకటిక న్యాయము
*****
శాకటికుడు అనగా బండి వాడు లేదా బండి నడిపే వాడు.
బండి నడిపే వ్యక్తికి సంబంధించి కూడా ఓ న్యాయమా? అదేం న్యాయమో? అని కాసింత ఆశ్చర్యం, అసహనం మీకు ఈ పాటికి కలిగే వుంటాయి.కాదేదీ 'కవిత కనర్హమని' శ్రీ శ్రీ గారు అన్నట్లు ఇందులో కూడా ఓ మతలబు దాగి వుందండీ.
అదేదో చూద్దామా...
ఓ బండి తోలే వ్యక్తి ఏదో వస్తువు కొనడానికి వెళ్ళాడు. వస్తువు కొంటే దానికి ఎంతైందో ఇవ్వాలి కదా! వస్తువు యొక్క వెల ఎంతని అడిగితే నూరు రూపాయలని వ్యాపారి చెప్పాడు.దానికి మన బండి తోలే వ్యక్తి సమాధానం ఎలా వుందో చెప్పే ఈ సంస్కృత వాక్యం చదువుదాం.
" శిరశ్చేదేపి శతం న.దదాతి వింశతి పంచకంతు ప్రయచ్ఛతి శాకటికః" అంటే తల తీసినా, నూరు రూపాయలు ఇవ్వను.ఐదు ఇరవైలు మాత్రమే ఇస్తాను" అన్నాడట.
దీనిని బట్టి బండి వాడికి మూర్ఖత్వంతో పాటు వెర్రితనం ఎంత వుందో గమనించవచ్చు. అందుకే "పిచ్చి పలు రకాలు-వెర్రి వేయి విధాలు" అంటారు మన పెద్దలు. మరి ఈ బండి వాడు ఎంత వెర్రి వెంగళప్పనో అర్థమవుతోంది కదా!.
ఇలాంటిదే మరోటి చూద్దాం. ఓ యజమాని తన దగ్గర పని చేసే వ్యక్తికి పది రూపాయల నోట్లు రెండు ఇచ్చి ఓ పది రూపాయల పాలు,ఓ పది రూపాయల పెరుగు కొనుక్కుని రమ్మని చెప్పాడు.సరేనని కొట్టుదాకా వెళ్ళి గోడకు కొట్టిన బంతిలా వురికొచ్చాడు.
"అయ్యా! ఏ పది రూపాయలతో పాలు,ఏ పది రూపాయలతో పెరుగు తేవాలి?" అని అడిగిన ప్రశ్నకు తెల్ల మొహం వేశాడా యజమాని.
అంటే ఆ పనివాడు ఎంత అమాయకమైన మూర్ఖుడో అర్థమవుతోంది కదా!.
ఇలాంటి వారే పరమానందయ్య గారి పన్నెండు మంది శిష్యులు.వారి వెర్రితనం , అమాయకత్వానికి సంబంధించిన కథలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి.
ఓ సారి వాళ్ళు వాగు దాటవలసి వస్తుంది. దాటిన తర్వాత అందరం దాటామా? వారిలో ఎవరినైనా ఏరు మింగేసిందేమో? అనే సందేహం వస్తుంది. ఒక్కొక్కరు లెక్కించడం మొదలు పెడతారు. ఎన్ని సార్లు లెక్కించినా ఒకరు తక్కువ అవడంతో ఏడవడం మొదలు పెడతారు. అటువైపుగా వెళుతున్న ఓ బాటసారి వీళ్ళ దగ్గరకు వెళ్ళి విషయం అడుగుతాడు. వారిలో ఒకరిని ఏరు మింగేసిందని భోరున ఏడుస్తూ చెబుతారు. వాళ్ళెంత మందో అడిగి లెక్క పెడతాడా బాటసారి. వీళ్ళ తెలివితక్కువ తనం అర్థమవుతుంది. వారిని వరుసగా నిలబెట్టి లెక్కింప జేసి అందరూ అందరూ ఉన్నారని చెప్పిన తర్వాత వాళ్ళు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. "అయ్యో! వీళ్ళు ఎంత మూర్ఖులు , వెర్రి వెంగళప్పలు " అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడా బాటసారి.
ఇలాంటి మూర్ఖులు, వెర్రి వెంగళప్పలు చేసే తెలివి తక్కువ పనులు చూస్తుంటే ఎంతో వింతగానూ వుండి నవ్వు తెప్పిస్తుంటాయి.
వీళ్ళని చూసినప్పుడు "పురుషులందు పుణ్య పురుషులు వేరయా" అని రాసిన వేమన పద్యాన్ని పేరడీగా "మూర్ఖులందు పరమ మూర్ఖులు వేరయా" అని పాడుకోవాలనిపిస్తుంది.
ఇదండీ "శాకటిక న్యాయము" యొక్క కథా కమామీషు.భలే సరదాగా ఉంది కదండీ! ఈ న్యాయము.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
శాకటిక న్యాయము
*****
శాకటికుడు అనగా బండి వాడు లేదా బండి నడిపే వాడు.
బండి నడిపే వ్యక్తికి సంబంధించి కూడా ఓ న్యాయమా? అదేం న్యాయమో? అని కాసింత ఆశ్చర్యం, అసహనం మీకు ఈ పాటికి కలిగే వుంటాయి.కాదేదీ 'కవిత కనర్హమని' శ్రీ శ్రీ గారు అన్నట్లు ఇందులో కూడా ఓ మతలబు దాగి వుందండీ.
అదేదో చూద్దామా...
ఓ బండి తోలే వ్యక్తి ఏదో వస్తువు కొనడానికి వెళ్ళాడు. వస్తువు కొంటే దానికి ఎంతైందో ఇవ్వాలి కదా! వస్తువు యొక్క వెల ఎంతని అడిగితే నూరు రూపాయలని వ్యాపారి చెప్పాడు.దానికి మన బండి తోలే వ్యక్తి సమాధానం ఎలా వుందో చెప్పే ఈ సంస్కృత వాక్యం చదువుదాం.
" శిరశ్చేదేపి శతం న.దదాతి వింశతి పంచకంతు ప్రయచ్ఛతి శాకటికః" అంటే తల తీసినా, నూరు రూపాయలు ఇవ్వను.ఐదు ఇరవైలు మాత్రమే ఇస్తాను" అన్నాడట.
దీనిని బట్టి బండి వాడికి మూర్ఖత్వంతో పాటు వెర్రితనం ఎంత వుందో గమనించవచ్చు. అందుకే "పిచ్చి పలు రకాలు-వెర్రి వేయి విధాలు" అంటారు మన పెద్దలు. మరి ఈ బండి వాడు ఎంత వెర్రి వెంగళప్పనో అర్థమవుతోంది కదా!.
ఇలాంటిదే మరోటి చూద్దాం. ఓ యజమాని తన దగ్గర పని చేసే వ్యక్తికి పది రూపాయల నోట్లు రెండు ఇచ్చి ఓ పది రూపాయల పాలు,ఓ పది రూపాయల పెరుగు కొనుక్కుని రమ్మని చెప్పాడు.సరేనని కొట్టుదాకా వెళ్ళి గోడకు కొట్టిన బంతిలా వురికొచ్చాడు.
"అయ్యా! ఏ పది రూపాయలతో పాలు,ఏ పది రూపాయలతో పెరుగు తేవాలి?" అని అడిగిన ప్రశ్నకు తెల్ల మొహం వేశాడా యజమాని.
అంటే ఆ పనివాడు ఎంత అమాయకమైన మూర్ఖుడో అర్థమవుతోంది కదా!.
ఇలాంటి వారే పరమానందయ్య గారి పన్నెండు మంది శిష్యులు.వారి వెర్రితనం , అమాయకత్వానికి సంబంధించిన కథలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి.
ఓ సారి వాళ్ళు వాగు దాటవలసి వస్తుంది. దాటిన తర్వాత అందరం దాటామా? వారిలో ఎవరినైనా ఏరు మింగేసిందేమో? అనే సందేహం వస్తుంది. ఒక్కొక్కరు లెక్కించడం మొదలు పెడతారు. ఎన్ని సార్లు లెక్కించినా ఒకరు తక్కువ అవడంతో ఏడవడం మొదలు పెడతారు. అటువైపుగా వెళుతున్న ఓ బాటసారి వీళ్ళ దగ్గరకు వెళ్ళి విషయం అడుగుతాడు. వారిలో ఒకరిని ఏరు మింగేసిందని భోరున ఏడుస్తూ చెబుతారు. వాళ్ళెంత మందో అడిగి లెక్క పెడతాడా బాటసారి. వీళ్ళ తెలివితక్కువ తనం అర్థమవుతుంది. వారిని వరుసగా నిలబెట్టి లెక్కింప జేసి అందరూ అందరూ ఉన్నారని చెప్పిన తర్వాత వాళ్ళు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. "అయ్యో! వీళ్ళు ఎంత మూర్ఖులు , వెర్రి వెంగళప్పలు " అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడా బాటసారి.
ఇలాంటి మూర్ఖులు, వెర్రి వెంగళప్పలు చేసే తెలివి తక్కువ పనులు చూస్తుంటే ఎంతో వింతగానూ వుండి నవ్వు తెప్పిస్తుంటాయి.
వీళ్ళని చూసినప్పుడు "పురుషులందు పుణ్య పురుషులు వేరయా" అని రాసిన వేమన పద్యాన్ని పేరడీగా "మూర్ఖులందు పరమ మూర్ఖులు వేరయా" అని పాడుకోవాలనిపిస్తుంది.
ఇదండీ "శాకటిక న్యాయము" యొక్క కథా కమామీషు.భలే సరదాగా ఉంది కదండీ! ఈ న్యాయము.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి