రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావు, పోలాకి ఈశ్వరరావులు అరుదైన గౌరవం పొందారు. కవిసేన, ఆర్ట్ ఫౌండేషన్, తెలుగు రక్షణ వేదికలు సంయుక్తంగా నిర్వహించిన సహస్ర కవిసమ్మేళనంలో తిరుమలరావు, ఈశ్వరరావులు పాల్గొని తమ కవితా పఠనాన్ని వినిపించి ప్రశంసాపత్రాలు సాధించారు.
కళారత్న పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో వేయిమందికి పైబడి కవులతో అంతర్జాలం ద్వారా నిర్వహించిన సహస్ర కవితా సమ్మేళనంలో వీరిరువురి కవితా గానం అందరి ప్రశంసలు పొందాయి.
అమ్మ తెలుగమ్మ భారతమ్మ అనే అంశాలపై జరిగిన ఈ సమ్మేళనంలో
తిరుమలరావు అమ్మంటే శ్వాస, ఈశ్వరరావు అమ్మే తొలిదైవం అనే కవితలను వినిపించారు.
వీరికి నిర్వాహక అధినేత పొట్లూరి హరికృష్ణ ప్రశంసాపత్రాలు పంపారు.
తిరుమలరావు, ఈశ్వరరావుల ప్రతిభకు మరో అరుదైన సత్కారాలు లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి