మెరుగైన ఫలితాలకై కృషి


 విద్యార్థుల విద్యా స్థాయిని మరింత మెరుగుపరిచీ, సత్ఫలితాల దిశగా పయనించేలా మనమంతా కృషి చేయవలసిన అవసరం ఉందని
కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 
ఇటీవల జరిగిన రెండో నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్షల అనంతరం వాటి ఫలితాలను వివరిస్తూ ఆయన ప్రసంగించారు. 
ముఖ్య అతిథిగా హాజరైన 
తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బూరాడ రమేష్ మాట్లాడుతూ విద్యావంతులను ఈ సమాజం ఎల్లవేళలా పూజిస్తుందని, కాబట్టి బాల్యం నుండే బాలలంతా పుస్తక పఠనానికి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. పాఠశాల, విద్యార్థుల ఉన్నతికై ఎల్లవేళలా తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. 
ఉపాధ్యాయులు తూతిక సురేష్ మాట్లాడుతూ అదనపు తరగతులను నిర్వహించి వారిలో చదువుల స్థాయిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 
అనంతరం ప్రగతి పత్రాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేసి విశ్లేషించారు. తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విద్యార్థుల స్థాయి, హాజరు, మధ్యాహ్న భోజన పథకం, టోఫెల్, క్రీడలు, ప్రోజెక్ట్ వర్క్స్ తదితర అంశాలను చర్చించారు. 
ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్ముంనాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొని ప్రసంగించారు.
కామెంట్‌లు