కర్ణుని పూర్వజన్మ! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో దురదృష్టవంతుడైన వ్యక్తి కర్ణుడు.
కర్ణుడు లేనిదే భారతయుద్ధం జరిగేది కాదు.ఎన్నో మంచిగుణాలు దానధర్మాలు చేసిన కర్ణుడు పుట్టీపుట్టగానే  కన్యయైన కుంతీదేవి కి నవమాసాలు మోసే పనిలేకుండా సూర్యుని వరప్రసాదం గా సహజకవచం కుండలాలతో జన్మించాడు.చాలా అందగాడు ఆజానుబాహుడు తెల్ల మద్ది చెట్టు లా ఆకర్షణ కల్గిన వాడు అని భారతంలో వర్ణింపబడినాడు.ధర్మరాజు యమధర్మరాజు అంశతో 
పుట్టిన సుగుణాలు రాశి.సూర్యసంబంధంగా ఇద్దరూ అన్నదమ్ములే.కానీ పాండవులకి తెలీదు.అసలు పూర్వజన్మ లో కర్ణుడు రాక్షసుడు.వెయ్యికవచాలు 
కుండలాలు కల్గిన గొప్ప తపస్సు చేసిన వాడు.అతన్ని చంపాలంటే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే ఒకకవచం కుండలం పోతాయి.మళ్ళీ వేయి ఏళ్ళు తపస్సు చేస్తే ఇలా ఒక్కొక్క టి పోతాయి.ఆఖరికి ఒకే ఒక్క కవచం తో మిగులుతాడు.అందుకే నరనారాయణులు వెయ్యి ఏళ్ళు వంతులప్రకారం ఒకరు తపస్సు ఇంకొకరు యుద్ధం చేస్తూ 999 పూర్తి చేశారు.ఆఖరుకి నరుడు 
అర్జునుడు గా నారాయణుడు కృష్ణునిగా పుట్టి కర్ణుని
పడగొట్టారు.ఎవరికైనా మృత్యువు తప్పదు.అంతటి
గొప్ప వారి చేతిలో మరణించాడు కర్ణుడు.ఇక1 మంచి మిత్రుడు మంచి మిత్రుడు! అచ్యుతుని రాజ్యశ్రీ
ఆపదలో ఉన్న వారిని గమనించి సాయంజేసేవాడు మంచిమిత్రులు.అలాంటి కథ  కొంగయైన నాడీజంఘుని మంచి తనం తెల్సుకుందాం.నిజమైనహితుడు ఆపదలో తాను ఉన్నా తన ప్రాణమిత్రునికి సాయం చేస్తాడు.కృష్ఢుడు తరతమభేదాలు ఎంచక కుచేలునికి సాయంజేశాడు.ద్రుపదుడు ద్రోణుని అవమానిస్తే సహించి శిఖండి కి విద్యనేర్పాడు.ఇక మహాభారతం లో ఓకథ ఉంది.ఒకమంచి కుటుంబం లో పుట్టినవాడు చెడుసావాసాలకు మరిగి మద్యం మాంసం వేట ల్లో దైవం ని గూర్చి మర్చాడు. భ్రష్ఠుడైనవాడిని చూసి నాడీజంఘుడనే కొంగ జాలిపడ్తుంది."మనిషి కి మంచిమిత్రులు వెండి బంగారం బుద్ధి తెలివి తేటలు వుంటే జీవితం మలుపు తిరుగుతుంది.నీవు సుఖపడే మార్గం చెప్తాను.మంచిమార్గంలో నడు" అని ఆవేటగానికి
చెప్తుంది3 మధువ్రజం అనే పట్టణంలో విరూపాక్షుడు అనే రాక్షసుడు ఉత్తముడు.ఈవేటగాడికి కావాల్సినంత ధనం ఇచ్చి పంపాడు.కానీ వాడి మీద ఎందుకో అనుమానం వచ్చింది.వీడు కొంగ దగ్గరకు వెళ్ళి " నీస్నేహితుడు కావాల్సినంత ధనం ఇచ్చాడు" అని అంటాడు.కొంగ ఆనందంతో నిద్ర పోయింది.ఈదుష్టుడు ఆకలిబాధతో ఆకొంగని చంపి మాంసం మూటగట్టుకుని బైలుదేరాడు. రాక్షసునికి ఆదొంగమీద అనుమానం వచ్చి తన భటుల్ని పంపాడు.వారు వాడిని పట్టుకుని వస్తే రాక్షసులు కుక్కలతో సహా ఎవరూ ఆనీచుడ్ని చంపితింటానికి
ఇష్టపడలేదు.వాడిని స్థంభానికి కట్టేశారు.కొంగ శరీరభాగంకి దహనసంస్కారం చేసి " నామిత్రుడ్ని బ్రతికించమని విరూపాక్షుడు దేవతలని ప్రార్ధించటం
కొంగ సజీవరూపంతో బతికి ఆవేటగాడిని క్షమించడం 
నిజంగా అపూర్వ ఘట్టం.తనప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన కొంగ దాని మిత్రుడు రాక్షసుడు విరూపాక్షుడు ఆదర్శం.కానీ మిత్రుల ఎన్నికలో జాగ్రత్తలు తీసుకోవాలి సుమా.
కామెంట్‌లు