మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు  తెలుగు ప్రాంతమంతా మద్రాసు అరవ ప్రాంతంలో కలిసి ఉండేది అప్పటికి మనవారు ఎక్కడికి వెళ్ళినా వీరు మద్రాసి అనే వారే తప్ప ఆంధ్రుల పేరు లేదు  అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ  బాధ్యతలన్ని మద్రాసు ప్రభుత్వాలు చూస్తూ ఉండేవారు  అప్పుడు తిరుమలై తిరుపతి  అని పిలిచేవారు  మలై  అన్న తమిళ శబ్దానికి అర్థం  కొండ అని  పవిత్రమైన కొండ. తిరు అన్న శబ్దానికి పవిత్రమైన అని అర్థం  పవిత్రమైన ఏడుకొండలు దాటి చివరకు వెళ్లిన తరువాత  అక్కడ తిరుపతి  కొలువై ఉంటారు  వారిని దర్శించి తరిస్తారు భక్తులు  పతి అంటే రక్షకుడు  భర్త  స్వామి భగవంతుడు అన్న అర్థాలు ఉన్నాయి  పవిత్రమైన భగవత్ స్వరూపం కనుక  తిరుపతి స్వామి అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి ఆదిశంకరాచార్యులవారు వెళ్లి  ఆ స్థలాన్ని చూసి అక్కడ పవిత్రతను గమనించి  ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే  దర్శించుకున్న ప్రతి వారి పాపాలు పోతాయి అన్న అభిప్రాయంతో  అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పేరుతో బీజాక్షరాన్ని  ప్రతిష్టించారు  ఏడవ శతాబ్దం నుంచి 11వ   శతాబ్దం వచ్చేసరికి  స్వామివారి ఆదాయం పెరగడంతో  రామానుజ స్వామి వారు  అమ్మవారి ఆకారాన్ని అయ్యవారిగా చేశారని  ఒక  కథనం  స్త్రీని పురుషుని గమనించడానికి నయనం (కన్ను)  జఖనం  వక్షస్థలం ఈ మూటిని చూసి చెప్పవచ్చు  జఖనం చూసే అవకాశం ఎవరికీ ఉండదు  అక్కడ పనిచేస్తున్న పూజారులకు తప్ప కళ్ళు కనిపించకుండా చిరునామములు పెట్టినారు.
వక్షము కనిపించకుండా నగలు దండలు వాడారు  చరిత్ర తెలియని వారికి ఈ విషయాలు   అర్థం కావు  అహం బ్రహ్మాస్మి అని చెప్పిన శంకరాచార్యుల వారు ప్రకృతిని అమ్మవారిగా భావిస్తారు  అందుకే వారు అమ్మవారి పూజకే  జీవితాన్ని అంకితం చేసుకున్నారు  ఈరోజుకు తిరుపతి నుంచి వచ్చిన  భక్తులు  వెంకటేశ్వర స్వామి అని పిలవరు  బాలాజీ అని మాత్రమే పిలుస్తారు  బాల అమ్మగారు అన్న అర్థంలో  ఏది చారిత్రకము ఏది కాదో అన్న విషయం శివ నాగి రెడ్డి చరిత్రకారులు నిర్ణయించవలసి ఉంది  భగవత్ స్వరూపంగా ఉన్న వేంకటేశ్వర స్వామి  భక్తులను కాచి రక్షిస్తాడు  వారు ఏ బాధలలో ఉన్నా వాటిని తీరుస్తారు  అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు  వెంకటేశ్వర స్వామిని కొలువని వ్యక్తి  వారి ఛాయాచిత్రాన్ని ఇంటిలో పెట్టుకుని పూజించని కుటుంబం  దాదాపు లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కామెంట్‌లు