సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -453
కీటోద్ధార న్యాయము
   ****
కీట అనగా పురుగు.ఉద్ధార అనగా ఉద్ధరించుట, పైకి లేపుట ,కాపాడుట అనే అర్థాలు ఉన్నాయి.
ప్రవాహములో కొట్టుకుని పోవు పురుగులను తీసి ఒడ్డున పడవేస్తే,అవే  బతికి బయటపడి ఏవో ఒక ఆధారమును చూసుకుని సుఖపడతాయి.
మనమే కాదు మనతో పాటు సమస్త జీవులు ఈ భూమిపై నివసిస్తూ వున్నాయి.ఈ భూమ్మీద బతికేందుకు మనకు ఎంత హక్కు వుందో ఇతర జీవరాశికి కూడా అంతే హక్కు వుందని గ్రహించాలి. అందుకే మన పెద్దలు భూతదయ కలిగి వుండాలి. వేటినీ హింసించవద్దు. వాటికీ ఆపదలు వస్తూ వుంటాయి. అలాంటి సమయంలో వాటిని మనం రక్షించాలి.
"కీటకోద్ధార న్యాయము" అంటే అదే.
 అలా ఉపకారం, సహాయం చేయాలని పెద్దలు, చిన్నయసూరి లాంటి వారు ఎన్నో నీతి కథలు మనకు అందించారు.అందులోదే "చీమ -పావురం కథ". అది మనందరికీ తెలిసినప్పటికీ మరోసారి గుర్తు చేసుకుందాం.
 ఓ చెట్టు మొదట్లో చీమలు, చెట్టు కొమ్మలపై పావురాలు నివసిస్తూ ఉండేవి.
 ఓరోజు ఓ పావురం చెట్టు కొమ్మపై కూర్చుని వుంది. అది చూసిన వేటగాడు ఆ పావురాన్ని చూశాడు.దానిని వేటాడి కూర వండుకుని తినాలని అనుకున్నాడు.వెంటనే భుజానికి తగిలించుకున్న బాణం తీశాడు.
ఇదంతా గమనిస్తున్న చీమకు పావురం ఆపదలో వుందని అర్థమై పోయింది. గబగబా పాక్కుంటూ పోయి చంపడానికి బాణం ఎక్కుపెట్టిన వేటగాడిని గట్టిగా కుడుతుంది. 'అబ్బా!' అని కాలివైపు చూసుకోవడంతో  బాణం గురి తప్పుతుంది. అది చూసిన పావురం 'హమ్మయ్య! బతికి పోయాను' అని సంతోషపడుతూ అక్కడ నుండి ఎగిరి పోతుంది.
వేటగాడు "అరెరే గురి తప్పిందే! అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అప్పుడు పావురం చీమకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఓరోజు బాగా వర్షం పడటంతో చెట్టు కిందకు నీళ్ళు వచ్చాయి.ఆ ప్రవాహంలో చీమ కొట్టుకుని పోవడం పావురం చూసింది. వెంటనే చెట్టుకు ఉన్న పెద్ద ఆకును  కోసి చీమకు దగ్గరగా వేసింది .చీమ ఆ ఆకు మీదకు చేరి ప్రాణాలను రక్షించుకుంటుంది.
ఇలా చీమ,పావురం ఆపదలో  ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటాయి. అలా మనుషులు కూడా సహాయం చేసుకోవాలని, చేయాలని చెప్పడం కోసమే ఈ "కీటకోద్ధార న్యాయము"ను ఉదాహరణగా చెప్పారు.
 ఒకోసారి సాటి వారికి సాయం చేయాలని ఉన్నా కొన్ని యిబ్బందులు ఎదురవుతూ వుంటాయి.  అయినా వాటిని అధిగమించి చేసే ప్రయత్నం మానవీయతకు నిదర్శనం.
అలాంటిదే మహాభారతంలోని ఓ కథను చూద్దాం.
 కౌరవుల వల్ల పాండవులు అడవుల పాలవ్వడం. ఒక సంవత్సరం అజ్ఞాత వాసం కూడా చేయాల్సి రావడం మనందరికీ తెలిసిందే కదా!
 అలాంటి అజ్ఞాత వాస సమయంలో పాండవులు ద్రౌపదితో కలిసి మారు వేషాలు పేర్లతో విరాట్ రాజు కొలువులో చేరుతారు.
 విరటుని భార్య సుధేష్ణాదేవి పరిచారికగా సైరంధ్రి పేరుతో వచ్చిన ద్రౌపదికి ఆశ్రయం ఇస్తుంది. కానీ ఆమె అందం చూసి తన భర్త  మోహితుడు అవుతాడోనని లోలోపల భయం కలిగించినా ఆమెలోని మానవతా హృదయం ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికే సిద్ధ పడుతుంది.
అయితే రావాల్సిన ఆపద భర్త వల్ల కాకుండా తోబుట్టువైన కీచకుని రూపంలో వస్తుంది.
అతడు చాలా దుర్మార్గుడు. కాదు కూడదు అని చెబితే  తమ రాజ్యానికి ముప్పు వాటిల్లుతుందని భయపడుతుంది. అయినా తనవంతుగా కీచకుని మనసు మార్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది.
సుధేష్ణ మంచి మనసును గ్రహించిన ద్రౌపది తన భర్తల సహకారంతో కీచకుని పీడ వదిలించుకుంటుంది.ఆ తర్వాత తమ కుమారుడైన  అభిమన్యునికి విరాట్ రాజు, సుధేష్ణల కుమార్తె ఉత్తరను ఇచ్చి వివాహం జరిపిస్తుంది.
ఇలా సుధేష్ణాదేవి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం  చేస్తుంది.
 అంటే ఎదుటి వారు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమనేది మానవీయ గుణం.అది ఈగనా?బూగనా?కుక్కనా? పిల్లినా? పిట్ట నా? చెట్టునా? ఏదైనా సరే? ఎవరైనా  సరే ఆపదలో ఉన్నప్పుడు  ఆదుకోవడం , రక్షించడం మన కర్తవ్యంగా భావించాలి.
అదండీ! "కీటకోద్ధార న్యాయం" లోని అంతరార్థం. దానిని సదా గమనంలో పెట్టుకొందాం. సహాయం చేయడంలో ముందు వరుసలో వుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం