కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తల్లి పిల్లలకు చెప్పవలసిన విషయాలలో ముఖ్యమైనది మన భాషలో ఉన్న అర్థాలు  సరైన అర్థం లో సరైన  పద విభజన ద్వారా చెప్పగలిగితే ఆ బిడ్డ  భవిష్యత్తులో మంచి విద్యార్థిగా తయారవుతాడు  చిన్నపిల్లల్లో పెద్దవాళ్లు భగవంతుని దగ్గర కూర్చుని పూజ చేస్తూ ఉన్నప్పుడు వాడు కూడా పూజ చేయడానికి సిద్ధమవుతారు  మనం ఏది చేస్తే పిల్లలు దానిని అనుసరిస్తూ ఉండడం సహజం  అయితే దీనిని నియమాలయానికి ఎలా చేయాలి అన్నది కూడా  వాళ్లకు తెలియాలి  మనకున్న హిందూ ముస్లిం క్రైస్తవ మతాల పద్ధతులలో  భగవంతుని స్తుతించడానికి కానీ పూజ చేయడానికి కానీ వారి పద్ధతులు వారికి ఉంటాయి  క్రైస్తవులు  ముస్లింలు వారి పద్ధతిలో చేస్తూ ఉంటారు హిందువులు మాత్రం  కొంతమంది గుడికి పూజకు వెళుతూ ఉంటారు  కొంతమంది ఇంటిలోనే చేసుకుంటూ ఉంటారు.
ఏ ఆలయమైనా జ్ఞానిగా జన్మించిన వాడిని విజ్ఞానిగా చేయడానికి పనికొస్తాయి  విద్యాలయాలు కావచ్చు వైద్యాలయాలు కావచ్చు  దేవాలయాలు కావచ్చు గ్రంథాలయాలు కావచ్చు వీటిలో ఏ ప్రాంతానికి వెళ్లినా  తన మనసు వికసించే విషయాలే అక్కడ మనకు కనిపిస్తాయి తప్ప  వేరే విషయాలకు స్థానం ఉండదు  విద్యాలయంలోకి వెళితే అక్షరం ఎలా దిద్దాలో ఎలా నేర్చుకోవాలో దానిని ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో  గురువు ద్వారా నేర్చుకోవలసిన  పద్ధతి అక్కడ ఉంటుంది  కొంచెం పెరిగి విద్యలో  కొన్ని పద్ధతులను అధ్యయనం చేసిన తరువాత  దానిలో ఉన్న మూల సూత్రాలు ఏమిటో కూడా గురువు ద్వారా తెలుసుకోవచ్చు  ప్రత్యేకించి తెలుసుకోవలసినది స్పష్టత, క్లుప్తత. స్పష్టత అంటే అక్షరాలను స్పష్టంగా పలకడం అన్న అర్థంలో కాకుండా  నీవు ఏ విషయాన్ని గురించి ఇతరులకు చెప్పదలుచుకున్నావో దాని గురించిన  మొత్తం పాఠం  నీ దగ్గర సిద్ధంగా ఉండాలి  నీవు చెప్పదలుచుకున్న విషయంలో  దేని తర్వాత ఏది చెప్పాలో  పద్ధతి ప్రకారం  ఎదుటివారికి అర్థమయ్యేట్లుగా చెప్పడం  స్పష్టత  క్లుప్తత అంటే  చాట భారతము లాగా అమ్మలక్కలు కూర్చున్నప్పుడు ఏవేవో మాట్లాడుతూ ఉన్న విషయాలు కాకుండా  నీవు ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నావో దానిని స్పష్టంగా చెప్పాలి  దానికి ఎలాంటి అతిశయోక్తులు కానీ  కథలాగా చెప్పడం కానీ  సాగదీయడం కానీ లేకుండా చెప్పడం క్లుప్తత కిందకు వస్తుంది

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం