ఐన్స్టీన్ మేడం క్యూరీల ప్రశంసలు అందుకున్న ఘనుడు! ‌అచ్యుతుని రాజ్యశ్రీ

 ఏడుగురు చెల్లెళ్ళున్న అన్న ఆకుర్రాడు తల్లి మరణించినా తండ్రి క్రమశిక్షణలో పెరిగాడు.4వక్లాస్ విద్యార్థి గా చాకు లాంటి కుర్రాడు అని అందరి ప్రశంసలు పొందారు.లెక్కల్లో 100కి 110మార్కులు పొంది కొత్త రికార్డు నెలకొల్పారు.1939 లోనే తల్లి కన్నుమూస్తే ఆపిల్లాడు బాధ్యత బరువులు మోసి
సైన్స్ పరికరాలు తయారు చేసేవారు.20వ ఏటనే పెళ్లయింది.ఎం.ఎస్సీ లో కూడా ఫస్ట్ రాంక్!ఢాకా
యూనివర్సిటీ లో ఫిజిక్స్ రీడర్ గా ఆంగ్లంలో 6పేజీల వ్యాసం ( ఫిజిక్స్) రాసి ఐన్ స్టీన్ కి పంపడం ఆయన
దాన్ని జర్మన్ భాషలోకి అనువాదం చేసి ప్రచురణ కి పంపడంతో మన శాస్త్రవేత్త సత్తా ప్రపంచం తెల్సుకుంది." మీకు డాక్టరేట్ డిగ్రీ సిఫార్సు అనవసరం" అని ఐన్ స్టీన్ ప్రశంసించారు.25 ఏళ్ళు ఢాకా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా  ఆపై విశ్వభారతికి వి.సి.గా పనిచేశారు.
2మాథమెటికల్ ఫిజిక్స్ లో మేథావి.కృత్రిమ ఎరువుల తయారీ గులాబీ పూలతో పరిమళ ద్రవ్యాలు ఆయన పరిశోధన కి నిదర్శనం.సభలో నిద్రలో జోగుతూ ఉన్నట్లు కన్పించేవారు.నీల్స్ బోర్ అనేవక్త బోర్డు మీద రాస్తూ ఒక సైన్స్ ఫార్ములా మర్చిపోతే ఠక్కున కళ్ళు విప్పి చకచకా బోర్డు పైన రాసి వివరించారు.అంతే! ఆయన నిద్ర పోతున్నారని
అనుకున్న ప్రేక్షకులు డంగైపోయారు.పుస్తక పఠనం
పిల్లితో ఆడుకోవడం ఆయన హాబీలు.మేడం క్యూరీతో ఫ్రెంచ్ భాషలో మాట్లాడేవారు.సంగీతంలోనైపుణ్యం సరికొత్త రాగాలకు స్వరకల్పన చేసిన దిట్ట.బెంగాలీ వాద్యం
ఎస్రాజ్ ను హాయిగా వాయించేవారు.కల్కత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పి.జి.వారికి ఫిజిక్స్ ని
బెంగాలీ భాషలో బోధించారంటే నమ్మబుద్ధి కాదు గదూ!? అర్థం కాని విషయం తెల్సుకోటం కోసం విద్యార్థులు ఆయన ఇంటికి వెళ్ళితే ఎంత అలసి డస్సిపోయినా తిరిగి బోధించేవారు.పరీక్షవాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తాంఅన్న విద్యార్థులతో
" నేను జాబ్ కి రాజీనామా చేస్తాకానీ మీ డిమాండ్ కి తల ఒగ్గను" అనటంతో  ఆయన లాంటి ప్రొఫెసర్ దొరకడం కష్టం అని గ్రహించి వారు జీహుజూర్ అనక తప్పలేదు.
3 అశుతోష్ ముఖర్జీ ఎం.ఎస్సీ.పరీక్షపేపర్లో ఒకే ప్రశ్న మూడేళ్ళు వరుసగా ఇచ్చారు." మీరు ఇచ్చిన ప్రాబ్లం తప్పు.విద్యార్ధులు ఏంరాయగలరు?" అని మీటింగ్ లో నిలదీశారు.మిగతా ప్రొఫెసర్లు అంతా భయపడ్డారు.కానీ అశుతోష్ తన తప్పు తెలుసుకొని అభినందించారు.ఇదీ ఆనాటి వారి గొప్పతనం.మనమైతే మూతి ముడుచుకుని శాపనార్థాలు పెడతాం.ఆయన జీవిత చరిత్ర రాద్దామని ఓజర్నలిస్ట్ వెళ్లితే" నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు?" అని సున్నితంగా తిరస్కరించారు.1974 ఫిబ్రవరి 4న భార్య ఇద్దరు కొడుకులు ఐదుగురు కుమార్తెలను వదిలి కన్నుమూసిన ఈమహాశాస్త్రవేత్త సదా వందనీయుడు..
4 ఐన్ స్టీన్ మేడం క్యూరీల ప్రశంశలు పొందిన
ఆయన సత్యేంద్రనాథ్ బోస్.తండ్రి సురేంద్ర నాథ్ రైల్వే ఉద్యోగి.తల్లి ఆమోదిని.పద్మవిభూషణ్  బోస్1952 లో రాజ్యసభ సభ్యుడు గా ఉన్నారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం