:గురువులు చెప్పిన మాట చదన్నం మూట. ;-ఎండీ. రియాజ్ 10వ తరగతి జి. ప. ఉ. పాఠశాల.నీర్మాల
 అనగనగ గారెపల్లి అనే ఊర్లో ఒక ఐదుగురు స్నేహితులు ఉండేవారు అందులో కొందరు పేద కుటుంబం వారు. వాళ్లు నాలుగవ తరగతి నుండి కలిసి మెలిసి ఉండేవారు. వాళ్లు రోజు వాళ్ళ ఊరి సర్కారు బడికి వెళ్ళేవాళ్ళు. ఆ బడిలో కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక ఆరవ తరగతికి వచ్చాక ఐదుగురిలో ముగ్గురు చిల్లరగా తయారయ్యారు అంత చెడు అలవాట్లుకి బానిసలయ్యారు మిగత ఇద్దరు చాలా బాగా చదువుతారు అలాగే మంచి పనులు చేస్తారు. ఆ ముగ్గురుకి ఈ ఇద్దరు వద్దురా అలాంటి పనులు అని చెప్పిన వినకుండ ఏ ఏంకాదు తీరా అని యి ఇద్దర్ని అనే వాళ్లు. ఏడో తరగతిలో వాళ్లు సిగరేట్లు కూడా మొదలు పెట్టారు ఆ ముగ్గురు. పాపం ఆ ఇద్దరు ఎంత వద్దు అని చెప్పిన వినకుండ వీళ్ళని తిట్టేవారు. కానీ వీళ్ళు మేము తాగము అని అనేవారు కాదు. ఇంకా ఆ ముగ్గురకి టీచర్స్ చెప్పిన మాటలు కూడా వినేవారు కాదు. ఇంకా టీచర్లనే బాధపెట్టేవారు.టీచర్లు అప్పుడప్పుడు వీళ్ళు చేసే పనులకు కోపం తెచ్చుకొని తిట్టకుండా ఉండేవారు. ఆ ఇద్దరు వాళ్లకు ఇలా చెప్తారు అరేయ్ మీది చాలా పేద కుటుంబంర మాలాగా చదివి ఉండండ్రా ని జీవితాన్ని నీ కుటుంబం నీ ఆగం చేస్తున్నావ్. అప్పుడు ఆ ముగ్గురు ఇలా అనేవారు ఏ ఏంట్రా మీరు ఏమైనా ఐనప్పుడు చూద్దాం అని అనేవారు. ఆ ఇద్దరికి అప్పటి నుంచి ఏ వీళ్ళు మారారు అని అర్థం చేసుకొని ఇక వాళ్ళతో స్నేహం కొంచం తగ్గించారు. ఆ ముగ్గురు ఈ ఇద్దరు కలిసి ఒకరోజు దావత్ చేద్దాం అని ప్లాన్ కూడా వేసేవారు, ఆ ముగ్గురు ఏమో వ్యసనం తాగేవారు, ఆ ఇద్దరు థంప్స్అప్ తెచ్చుకొని ఇంకా తినేవి తెచ్చుకునేవారు. ఒక రోజు వీళ్ళ దావత్లో జరుపుకున్న విషయం ఇంట్లో తెలవగానే ఆ ఇద్దరు భయపడ్డారు. కానీ ఆ ముగ్గురు ఏమైంది ఎవడెం అంటాడు అని అంటారు. ఆ ఐదుగురు 9వ తరగతికి వచ్చేసరికి ఇంకా చెడ్డగా పనులు కూడా నేర్చుకున్నరు ఆ ముగ్గురు. ఇక ఆ ఇద్దరు చాలా బాగా చదువులో బాగా ముందుకు సాగారు, ఇక పోతుండగా పోతుండగా 10 వ తరగతి ఎగ్జామ్స్ రాస్తారు. అందులో ఇద్దరు చాలా బాగా రాసి మంచి మార్కులు తెచుకుంటారు. ఇక ఆ ముగ్గురు ఫెయిల్ అవుతారు. ఒక రోజు వీళ్ళు ఐదుగురు బడికి వెళ్తే వాళ్ళ సార్ అంటాడు ఎరా మీరు ముగ్గురు ఎందుకు ఫెయిల్ ayyaru వీళ్ళు ఇద్దరు బాగా రాసి పాస్ అయ్యారు అంటాడు. ఇక కొన్ని రోజల తరువాత ఆ ఇద్దరు చాలా మంచి ధనవంతులు అవుతారు కానీ ఆ ముగ్గురు ఆడుక్కుతింటారు.

నీతి : మంచి గురువులు చెప్పే మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే చెడ్డ అలవాట్లకు బానిస అవుతే పెద్దయ్యాక అనేక కష్టాలు పడాల్సి వస్తుంది
.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం