వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143
 మాటరాని నీకు మాట నేర్పి  ఉన్నత స్థితికి వెళ్లి నాకు  నా  వంశానికి పేరు తీసుకువస్తాడని  అనుక్షణం తన కౌగిలిలో  అన్ని సౌకర్యాలు ఇస్తూ వాడిని సమాజంలో ఒక వ్యక్తిగా నిలబెడితే  దేశానికి రాష్ట్రానికి సేవ చేయకపోవచ్చు సమర్థతలేని కారణం కూడా దానికి  దోహదపడుతుంది  కానీ అలాంటి కన్నతల్లిని అనాథ ఆశ్రమాల పాలు చేస్తున్నావే అక్కడ నీ తల్లిని వారు ఎలా చూస్తారో నీకు ఏమైనా  ఆలోచన ఉన్నదా  ఒక్కసారి అక్కడ పరిస్థితులను గమనించినట్లయితే  నీకు ఈ పాడు బుద్ధి రాదు  నీ చిటికెన వేలి తో నడిపించుకుంటూ వెళ్లిన తండ్రి  తనను మించి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికే విలువైన సేవలు చేయాలని కలలు కన్నా  ఆ ముదుసలి కి నీవిస్తున్న కానుక ఏమిటి.
అమ్మానాన్నలను  కారు చీకటిలో ఉంచి  వారు సజీవులా నిర్జీవులని కూడా చూడకుండా  ఇతర దేశాలలో ధనార్జన ధ్యేయంగా జీవిస్తున్నావు అది నీకు స్వదేశంగా అనిపించిందా అక్కడే శాశ్వతంగా ఉండాలని ఉన్నదా  బయటకు వచ్చిన తర్వాత సొంత గ్రామానికి ఒక్కసారి కూడా వెళ్ళని నీవు ఆ గ్రామ వాసులకు బయటి  వాడివి కాదా  పొరపాటు గా నీవు వెలితె ఏ ఒక్కరైనా గుర్తించగలరా  నీవు చేసిన ఒక్క మంచి పనిని గురించి వారు ఒక్క మంచి మాట చెప్పగలిగే స్థితిలో ఉన్నారా  నిన్ను నీ గురించి  నీవే ఆలోచించుకో  కలిసి ఉండి ఆత్మీయతలను పంచి  తల్లిదండ్రులను సుఖసంతోషాలతో నింపవలసిన బిడ్డ  అడ్డాల రోజులలో బిడ్డగాని గడ్డాల రోజులలో న బిడ్డ అన్న సామెతలు  నిజం చేసి చూపిస్తున్నావు కదా  పోనీ దీని వల్ల  ఏమైనా ఆత్మానందం కలుగుతుందా అంటే  వారు నీ చిన్నతనంలో చేసిన పనులు జ్ఞాపకం వస్తే నిజానికి గుండె ఉంటే అది ఆగిపోదట రా.
జ్ఞానపీఠ బహుమతి పొందడం అంత సులభం కాదు  క్షణం కాని అక్షరాన్ని  అక్షరంగా తీర్చిదిద్దడం  సాహిత్య లక్షణం  ఆంధ్ర దేశంలో మేధావి వర్గానికి ఏ లోపము లేదు అన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు  ఇప్పటికే మూడు పర్యాయాలు జ్ఞానపీఠ బహుమతిని ఆంధ్రులకు తెప్పించిన ఘనులు మనవారు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు  విశ్వం మొత్తం  మన నేతకు అర్థమయ్యే పద్ధతిలో  నాలుగు వర్ణముల  విభజన గురించి తెలియజేసిన వాడు  ఆంధ్ర దేశానికి  ప్రభుత్వ ఆస్థాన కవిగా  తమ గురువులు అధిష్టించిన పీఠాన్ని  తిరుపతి వెంకట కవుల తరువాత ఆ గౌరవాన్ని పొందింది విశ్వనాథ వారే  వారు మాట్లాడుతూ ఉన్న ప్రతి అక్షరం మనకు  ఎన్నో అర్థాలను అందజేస్తుంది.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం