వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143
ప్రపంచానికి వాల్మీకి మహర్షి  రాసి అందించిన  సూక్తులను అర్థం చేసుకున్నట్లయితే  ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే ప్రయాణం చేయాలి అప్పుడు విజయం తప్పకుండా వస్తుంది  న్యాయబద్ధంగా జీవితాన్ని గడిపిన వాడికి ఎలాంటి  అవరోధాలు రావు  నిజానికి ధర్మానికి ఆపద ఎక్కువ అడుగడుగునా కష్టాలు  సీతమ్మ వారి కష్టాలు తెలిస్తే చాలు విషయం అర్థం అవుతుంది  అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా  ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగితే  చివరికి ధర్మమే గెలుస్తుంది  జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం నిన్న కలిగిన బాధను తుడుచుకుంటూ పొంగిపోకుండా  నేడు వాస్తవాన్ని గమనిస్తూ  దానిని అనుభవిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి తప్ప  నిన్న ఏదో తప్పు జరిగిందని ఆలోచిస్తూ దానిపైనే  మనసుపెట్టి చీకాకుగా ఉన్నట్లయితే  ముందు మీ ఆరోగ్యం చెడిపోతుంది  దానిని కాపాడుకోవడానికి అయినా  ఈ నిర్ణయం తీసుకోవాలి.
జయం అంటే గెలవడం  దీనిలో ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు  కానీ విజయం  అపజయానికి చోటే లేకుండా  ప్రతి దాంట్లోనూ  గెలుపును పొందటమే  తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళటం కాదు విజయవంటే  మీకు కుటుంబం ఉంది  వారి ఆనందాన్ని కూడా చూడవలసిన బాధ్యత నీకు ఉంటుంది  అంతే తప్ప ధన సేకరణ కోసం సమయాన్ని పూర్తిగా భక్షించడం వల్ల ఆ సుఖాన్ని  పొందలేవు  మనం సంపాదించిన దానిలో సంతృప్తిగా  కుటుంబ సభ్యులందరూ   తినాలి  మనకు ఉన్నదాంట్లో కొద్దిగా నయినా  అవసరమైన వారికి బాధల్లో ఉన్నవారికి ఆకలితో అలమటించే వారికి  సహకరిస్తూ  సాయం చేయడం అనేది మాత్రమే విజయానికి కొలబద్ద తప్ప  నీకోసమే  సంపాదించే నీకోసమే ఖర్చు చేసుకోవడం అనేది స్వార్థం కిందకు వస్తుంది  మనసున్న మనిషిగా ప్రవర్తించాలి అని మన పెద్దలు చెప్తారు.
మనం ఏదైనా కార్యాన్ని సాధించాలని అనుకున్నప్పుడు పట్టుదలతో దానిపై మనసుపెట్టి  నిజాయితీగా ప్రవర్తించాలి  అంతేగాని మనం గేద పాలు తీసిన తర్వాత ఆ పాలను చూసి  వెన్న వెన్న అని అడి నంత మాత్రం చేత వెన్న మన చేతికి వస్తుందా  పాలను కాచి ఆరబెట్టి తోడు వేసి పెరుగు అయిన తర్వాత దానిని చిలికితే అప్పుడు బయటపడుతుంది ఆ వెన్న  అలాగే దేవుడా దేవుడా అని అడిగిన అంత మాత్రం చేత దేవుడు నీ ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతాడా  నీవు చేసే కార్యం తదేక దీక్షతో పంచేoద్రియాలను నీ ఆధీనంలో ఉంచుకొని  మనసు చెప్పినట్లు నీవు వినకుండా నీవు చెప్పినట్లు మనసు వినేలా  ప్రయత్నం చేసిన వాళ్ళకి తప్పకుండా భగవద్ దర్శనం కలుగుతుంది  దానికి నిదర్శనం రామకృష్ణ పరమహంస.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం