ఫీలింగనేది రచనకు పునాది;- - యామిజాల జగదీశ్
 ప్రముఖ కవి, రచయిత గుంటూరు శేషేంద్ర శర్మకు నామకరణ వేళ పెట్టిన పేరు శేషభట్టు. ఆయన బంగారపు ఉంగరంతో బియ్యం మీద రాయించిన పేరిదే. అయితే అప్పుడు ఆయన పినతల్లి ఇంతటి ముతక పేరు పెడతారా అని శేషేంద్ర తండ్రి మీద విరుచుకుపడింది. కవి అయి ఉండి కూడా ఇలాంటి పేరు పెట్టడమా అని అనగానే బియ్యం మీద రాసిన శేషభట్టు అనే పేరును చెరిపేసి శేషేంద్ర శర్మ అని రాసి అందరికీ వినిపించారు ఆయన తండ్రి.
శేషేంద్ర శర్మ గురువుగారు నేతి కృష్ణమూర్తి. ఆయన శబ్దమంజరివంటి పుస్తకాలు శేషేంద్ర శర్మతో చదివించారు. ఆ తర్వాతి కాలంలో వావిలాల వేంకటేశ్వరశాస్త్రిగారి వద్ద తర్కాలంకారాలు చదువుకున్న శేషేంద్ర శర్మ ఉపనిషద్భాష్యాలు, వేదాంత పంచదశి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నెల్లూరులో హైస్కూలు వరకు చదవుకున్న శేషేంద్ర శర్మ గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చేశారు. అనంతరం మద్రాసు లా కాలేజీలో లా చదువుకున్నారు. 1945లో పెళ్ళి చేసుకున్నారు.
ఆయన రాసినది మొట్టమొదటగా విశాలాంధ్ర (దైనిక)లో క్షేమేంద్ర లేదా అశ్విని కలంపేరుతో అచ్చయ్యింది. ఆ రచన శీర్షిక -  ప్రపంచంలో ఎక్కడున్నా సరే....తొలిసారిగా ఈ రచన అచ్చయ్యినప్పుడు ఆయన ఆనందం పట్టరానిదైంది.
ఆయన తన కవిత్వం ద్వారా తన జీవితాలనుంచి ఏమిటో తన సుఖదు:లేమిటో తన స్వప్నాలేమిటో వ్యక్తపరిచారు.
ఆయన సినిమాలో రాసిన పాట ఒక్కటే ఒక్కటి. ఆ పాట ఇలా మొదలవుతుంది....
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని....
మళ్ళీ ఎందుకు సినిమా పాట రాయలేదని అడగ్గా ఆయన జవాబిస్తూ తాను కవినని, తనతో పాట రాయిస్తారా అని భిక్షాటన చేసే విదూషకుడ్ని కాదని అన్నారు.
మన భాషలో సున్న అంటే ఏమిటో చెప్తూ సున్నలో నుంచే కదా ఈ సమస్తం పుట్టిందంటారు.
సాహిత్యంలో నవల, నాటకం, కథ, కవిత్వం, ఇత్యాది సృజనాత్మక వాఙ్మయ ప్రక్రియలన్నీ ఉమ్మడిగా వర్తించే మాటేనన్నారు. అటువంటి సాహిత్యంలో ఒక ప్రక్రియా విశేషం కవిత్వం అని అన్నారు.
 మాటకొస్తే ఏ భాషలోనైనా కవిత్వం ఒకటే విశ్వజనీన ప్రక్రియ అని చెప్పారు. ప్రతిభావంతుడితో స్నేహం చేయాలంటే ప్రతిభ అవసరం లేదని, ప్రతిభ ప్రతిభాహీనుడిలోకి ప్రవహిస్తందని తెలిపారు.
నిజం దేవుడు ఎరుగు అన్నట్లు విరసం తననెందుకు ద్వేషించిందో తెలీదన్నారు.
జీవితానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని, జీవితం తల్లి అయితే సాహిత్యం శిశువు అని అన్నారు.
కవి పుట్టడని, పుట్టిన తర్వాత కవిగా రూపొందుతాడన్నది ఆయన అభిప్రాయం. కథ పుట్టాలంటే ప్రతీక పుట్టాలంటేనూ మనిషిలో ఫీలింగు ఉండాలన్నారు. అది పునాది అంటూ పక్కవాడు చస్తుంటే తన దారిన తాను పోయే ఈ దేశంలో ఏనాడో ఫీలింగు చచ్చినప్పుడు మంచి కథ పుట్టడమనేది కష్టమని శేషేంద్ర శర్మ ఓ మారన్నారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం