ఇనుపస్థంభం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఈరోజుల్లో ఇనుపవస్తువు నీరు తగిలి తే చాలు తుప్పు పట్టి విరిగిపోతుంది.కానీ ఢిల్లీ సమీపంలో ఉన్న మెహ్రౌలీలో ఇనుపస్థంభందాదాపు  1700 ఏళ్ళు కావొస్తున్నా గాలివానలో తడుస్తూ ఎండిపోతూ ఎంచక్కా తుప్పు పట్టకుండా నేలవ్రాలకుండా అలాగే ఇప్పుడు కూడా ఉంది అంటే అద్భుతంకదూ!?  7మీటర్ల ఎత్తు ఉన్న 6 టన్నుల బరువైన ఆఇనపస్థంభం పై మచ్చలు గీతలు తుప్పు లేనే లేవు.అసలు సిసలు ఇనుముతో పాటు ఐరన్ ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసిన  మిసమైట్ అనే మిశ్రమపు పూత ఇన్ని శతాబ్దాలుగా దాన్ని కాపాడుతోందని  ప్రపంచ శాస్త్ర సాంకేతిక నిపుణుల అభిప్రాయం. మరి ఆరోజుల్లో అవినీతి అక్రమాలు లేకుండా రాజు పనివారు ఉన్నారు కాబట్టే ఆ అద్భుత సంపదనిలిచింది.మరి నేడు మనం చూస్తూ ఉన్నాం కదా? ఇవాళ చేసిన రోడ్డు మరమ్మతులు వర్షాకాలంలో గాలిలో పేలపిండి.ఆహారం కూరలు పానీయాలు కల్తీ .గల్లంతు శాల్తీలు. నీతినిజా యితీ గా ధర్మం గా మనిషి లేకపోతే ప్రకృతి కూడా తిరగబడ్తుంది అని మన పురాణాలు రామాయణం భారతాలు చెప్తున్నాయి.కనీసం మనం ప్రవచనాలు విని పిల్లల కి పెద్దలు అమ్మ నాన్న లు  అధ్యాపకులు చెప్తూంటే అవినీతి అక్రమాలు అన్యాయాలు గూర్చి తెలుసు కుని పిల్లలు సకారాత్మకంగా ఆలోచించి ప్రవర్తిస్తారు కదూ!?🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం